GNTR: మేడికొండూరు మండలంలోని పేరేచర్ల భారీ గృహ లేఅవుట్ను కలెక్టర్ అన్సారియా శనివారం సందర్శించారు. మొత్తం 18,090 ఇళ్లలో, 9,600 అర్బన్ గృహాలు ఉన్నాయని.. ఈ పనులను యుద్ధప్రాతిపదికన పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. లబ్ధిదారులకు త్వరగా ఇళ్లను అందించేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఆర్డీవో శ్రీనివాసరావు, తదితరులు పాల్గొన్నారు.
TPT: చెత్త రహిత, సుందర తిరుపతి నిర్మాణానికి ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని నగరపాలక సంస్థ కమిషనర్ ఎన్. మౌర్య పిలుపునిచ్చారు. స్వర్ణాంధ్ర–స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో భాగంగా ఇవాళ దండి మార్చ్ వద్ద ప్రత్యేక అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఫోర్ బిన్ సిస్టం ద్వారా తడి, పొడి, ప్రమాదకర వ్యర్థాలు, ఈ-వేస్ట్గా చెత్తను వేరు చేయాలని సూచించారు.
SKLM: అంగన్వాడీలు సమయపాలన పాటించాలని మందస సీడీపీవోపీ అరుణ అన్నారు. శనివారం ఐసీడీఎస్ ప్రాజెక్ట్ స్థాయి సమావేశం నిర్వహించారు. ప్రీ స్కూల్ సిలబస్ ప్రకారం అమలు జరపాలని సూచించారు. మెనూ సక్రమంగా అమలు చేయాలని ఆదేశించారు. చిన్నారులకు ఈ కేవైసీ, ఆధార్ పెండింగ్ లేకుండా చర్యలు తీసుకోవాలన్నారు. టేక్ హోమ్ రేషన్ శత శాతం అమలు జరపాలని సూచించారు.
VSP: డిజిటల్ మార్కెటింగ్, సోషల్ మీడియా రంగాల్లో అవకాశాలు పెరుగుతున్న నేపథ్యంలో నిర్వహించిన క్యాంపస్ డ్రైవ్లో 20 మంది అభ్యర్థులు ఎంపికయ్యారు. మిలీనియం సాఫ్ట్ వేర్ సొల్యూషన్స్ సెంట్రల్ మేనేజర్ రవికుమార్ తెలిపారు. సుమారు 55 మంది అభ్యర్థులు పాల్గొనగా, సోషల్ మీడియా, గ్రాఫిక్ డిజైనింగ్, డిజిటల్ మార్కెటింగ్ నైపుణ్యాల ఆధారంగా ఎంపిక ప్రక్రియ నిర్వహింవారు.
PLD: చిలకలూరిపేట పట్టణంలోని 12వ వార్డు దాసరి కాలనీలో శనివారం నిర్వహించిన స్వచ్చాంధ్ర–స్వర్ణాంధ్ర కార్యక్రమంలో ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావు పాల్గొన్నారు. ఇందులో మున్సిపల్ అధికారులు, కూటమి నాయకులతో కలిసి పరిసరాలను శుభ్రపరిచారు. ఈ సందర్భంగా ఎలక్ట్రానిక్ వ్యర్థాల వల్ల పర్యావరణానికి కలిగే నష్టాలపై ప్రజలకు అవగాహన కల్పించారు.
PPM: సీతానగరం పెదభోగిల పంచాయతీ సుంకరవీధిలో శనివారం డాక్టర్ ఉషారాణి ఆధ్వర్యంలో సంచార వైద్య పరీక్షలు నిర్వహించారు. ఈ సందర్భంగా బీపీ, షుగర్, హెమోగ్లోబిన్ పరీక్షలు నిర్వహించి అవసరమైన మందులను పంపిణీ చేసారు. దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులకు బీపీ, షుగర్ పరీక్షల అనంతరం ప్రతి నెల ఏ మేరకు మెరుగవుతుందో పరిశీలించారు. అనంతరం వడదెబ్బ గురించి అవగాహన కల్పించారు.
NTR: మాచవరం పోలీస్ స్టేషన్లో కానిస్టేబుల్గా పనిచేస్తున్న దిలీప్ కుమారుడికి అనారోగ్యం నిమిత్తం ఆపరేషన్ చేయాల్సిన అవసరం ఉంది. ఈ మేరకు 20 లక్షలు నగదు అవసరం అయింది. విషయం తెలుసుకున్న సెంట్రల్ ఏసీపీ దామోదర్ సజ్జ కిషోర్, చారిటబుల్ ట్రస్ట్తో మాట్లాడి ఏడు లక్షల నగదును శనివారం ఇప్పించారు. ఈ మేరకు బాలుడికి ఆపరేషన్ చేయించనున్నట్లు సమాచారం.
PPM: గుమ్మలక్ష్మీపురం మండల కేంద్రంలో గల భద్రగిరి 50 పడకల ఆసుపత్రికి సీసీ రోడ్డు నిర్మాణ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. రూ.7 లక్షల 65 వేల NREGS నిధులతో చేపట్టిన రోడ్డు పనులు చివరి దశకు వచ్చాయని ఐటీడీఏ ఏఈఈ సింగంపల్లి అప్పారావు తెలిపారు. రోడ్డు నిర్మాణంలో నాణ్యత ప్రమాణాలు పాటిస్తున్నామని వెల్లడించారు. రహదారి పనులు పూర్తయిన వెంటనే ప్రారంభిస్తామన్నారు.
PLD: వినుకొండ విచ్చేసిన సీఎం చంద్రబాబుకు శనివారం ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు ఘనస్వాగతం పలికారు. ఈ సందర్భంగా నియోజకవర్గ అభివృద్ధికి ప్రత్యేక నిధులు ఇవ్వాలని కోరుతూ వినతిపత్రం అందజేశారు. ముఖ్యంగా పట్టణంలో స్టేడియం నిర్మాణానికి రూ. 50 కోట్లు కేటాయించాలని, అలాగే పెండింగ్లో ఉన్న ఇతర సమస్యలను పరిష్కరించాలని సీఎంను కోరారు.
ASR: ముంచంగిపుట్టులోని స్థానిక వారపు సంతను అగ్రికల్చర్ మార్కెట్ ఛైర్మన్ బోరి బోరి లక్ష్మి శనివారం పరిశీలించారు. కనీస వసతులు లేక ఎండ, వానలకు ఇబ్బందులు పడుతున్నామని రైతులు, వ్యాపారులు ఆమె ఎదుట ఆవేదన వ్యక్తం చేశారు. తక్షణమే సంతలో తాగునీరు, మరుగుదొడ్ల సౌకర్యం కల్పించాలని కోరారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు అప్పలస్వామి, పోతురాజు, సుబ్బారావు పాల్గొన్నారు.
VZM: టీడీపీ కార్యాలయంలో ఇవాళ కూటమి నేతలు పత్రికా సమావేశం నిర్వహించారు. జిల్లా అధ్యక్షులు కిమిడి నాగార్జున మాట్లాడుతూ.. MLC బొత్స సత్యనారాయణ ఎపీ శాసన మండలిలో చెప్పులు వేసుకుని వెంకటేశ్వరస్వామి ఫోటోని చేత్తో పట్టుకున్నామని నిరూపిస్తే రాజీనామా చేస్తామన్నారు. కౌన్సిల్ వీడియో రికార్డ్లో అది నిరూపణ అయింది. కావున రాజీనామ చేయాలని వారు డిమాండ్ చేశారు
నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కార్యాలయంలో ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, టీడీపీ నేత కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి సమక్షంలో 21వ డివిజన్, ఎన్టీవో కాలనీకి చెందిన కోడూరు రవి, ఖాదర్ బాష, ప్రవీణ్ వారి మిత్రబృందం టీడీపీలో చేరారు. వారికి పార్టీ కండువా కప్పి కోటంరెడ్డి సోదరులు సాదరంగా ఆహ్వానించారు. నూతనంగా చేరిన వారికి తగు ప్రాధాన్యత ఉంటుందన్నారు
CTR: చిత్తూరు నగరంలోని నాగయ్య కళాక్షేత్రంలో మెప్మా ఆధ్వర్యంలో నిర్వహించిన జాబ్ మేళాను ఎంపీ దగ్గుమళ్ళ ప్రసాదరావు, ఎమ్మెల్యే గురజాల జగన్ మోహన్ జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. యువత ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని తమ భవిష్యత్తుకు పునాది వేసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో మేయర్ అముద, చూడ ఛైర్పర్సన్ హేమలత తదితరులు పాల్గొన్నారు.
శ్రీకాకుళం అసెంబ్లీ నియోజకవర్గంలో ఓటర్ల జాబితా సవరణలపై పలు రాజకీయ పార్టీల ప్రతినిధులతో పరిపాలన అధికారి లక్ష్మినారాయణ అధ్యక్షతన ఆర్డీవో కార్యాలయంలో శనివారం సమావేశం జరిగింది. ఆయన మాట్లాడుతూ మరణించిన , రెండుసార్లు నమోదైన 324 ఓట్లను ఫారం–7 ద్వారా తొలగించినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో వివిధ రాజకీయ పార్టీ నాయకులు పాల్గొన్నారు.
KDP: ఆగ్నేయ బంగాళాఖాతంలో ఉపరిత ఆవర్తనం ప్రభావంతో రాబోయే 48 గంటల్లో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. దీని ప్రభావంతో కడప జిల్లాలో పలుచోట్ల పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే సూచనలు ఉన్నాయి. కొన్ని ప్రాంతాల్లో ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని అధికారులు హెచ్చరించారు. లోతట్టు ప్రాంతాల ప్రజలు జాగ్రత్తగా ఉండాలని సూచించారు.