• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »ఆంధ్రప్రదేశ్

నాణ్యమైన వైద్యమే ప్రభుత్వ లక్ష్యం: ఎమ్మెల్యే

ఎన్టీఆర్: నందిగామ పట్టణంలో ఆదివారం ప్రధానమంత్రి భారతీయ జన ఔషధీ కేంద్రం నూతన జనరిక్ మందుల షాపును ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య ప్రారంభించారు. ప్రజలకు నాణ్యమైన వైద్యం అందుబాటులో ఉండాలన్నదే ప్రభుత్వ లక్ష్యమని తెలిపారు. మార్కెట్ ధరలతో పోలిస్తే తక్కువ ఖర్చుతోనే అత్యుత్తమ నాణ్యత గల జనరిక్ మందులు లభించే విధంగా భారతీయ జన ఔషధీ కేంద్రాలు పనిచేస్తున్నాయన్నారు.

February 22, 2026 / 01:01 PM IST

ఆలయ బ్రహ్మోత్సవాల్లో పాల్గొన్న ఎమ్మెల్యే

కోనసీమ: ఆథ్యాత్మిక కార్యక్రమాల్లో పాలుపంచుకోవడం ద్వారా మానసిక ప్రశాంతత, మనోధైర్యం లభిస్తాయని కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావు అన్నారు. ఆదివారం మొదలైన ఆత్రేయపురం లక్ష్మీవేంకటేశ్వరస్వామి ఆలయ బ్రహ్మోత్సవాల్లో ఎమ్మెల్యే బండారు పాల్గొన్నారు. స్వామి వారిని దర్శనం చేసుకుని ప్రత్యేక పూజలు చేశారు.

February 22, 2026 / 01:00 PM IST

తాడిపత్రిలో రోప్ లైట్ పనుల పరిశీలన

ATP: తాడిపత్రి ఎమ్మెల్యే జేసీ అశ్మిత్ రెడ్డి, మున్సిపల్ ఛైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి సహకారంతో పట్టణంలో సాగుతున్న రోప్ లైట్ పనులను మాజీ మార్కెట్ యార్డ్ ఛైర్మన్ చింబిలి వెంకటరమణ పరిశీలించారు. అభివృద్ధి పనులు త్వరితగతిన పూర్తిచేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ కాళ్ల ఉమామహేష్, పంచాయతీ వార్డు సభ్యులు పాల్గొన్నారు. 

February 22, 2026 / 01:00 PM IST

జాతర మహోత్సవాలకు ఎమ్మెల్యేకు ఆహ్వానం

E.G: 70వ సింగారమ్మ జాతర మహోత్సవాలు మార్చి 3 నుంచి 7వ తేదీ వరకు నిర్వహించడం జరుగుతుంది. ఈ సందర్భంగా జాతర మహోత్సవంలో పాల్గొని జగ్గంపేట శాసనసభ్యులు జ్యోతుల నెహ్రూకు, కాకినాడ జిల్లా అధ్యక్షులు జ్యోతుల నవీన్‌కు ఆదివారం కమిటీ సభ్యులు ఆహ్వాన పత్రికను అందించడం జరిగింది. ఈ కార్యక్రమంలో తదితరులు పాల్గొన్నారు.

February 22, 2026 / 01:00 PM IST

రేపటి నుంచి జిల్లాలో ఇంటర్ పరీక్షలు

కృష్ణా: జిల్లాలో రేపటి (ఫిబ్రవరి 23) నుంచి ప్రారంభం కానున్న ఇంటర్మీడియట్ పరీక్షలకు అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. జిల్లా వ్యాప్తంగా 63 కేంద్రాల్లో 49,579 మంది విద్యార్థులు పరీక్ష రాయనున్నారు. కలెక్టర్ డీకే బాలాజీ ఆదేశాల మేరకు నిరంతర విద్యుత్, తాగునీరు, సీసీ కెమెరాల నిఘా ఏర్పాటు చేశారు. 

February 22, 2026 / 01:00 PM IST

SIగా వెంకటేశ్వర చౌదరి బాధ్యతలు

TPT: దొరవారిసత్రం నూతన ఎస్ఐగా గరికపాటి వెంకటేశ్వర చౌదరి ఆదివారం బాధ్యతలు స్వీకరించారు. బాధ్యతలు చేపట్టిన అనంతరం స్టేషన్ సిబ్బందితో సమావేశమై శాంతి భద్రతల పరిరక్షణకు కట్టుబడి పనిచేస్తామని తెలిపారు. మండల పరిధిలో అక్రమ కార్యకలాపాలపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. స్థానికులు, సిబ్బంది ఆయనకు శుభాకాంక్షలు తెలియజేశారు.

February 22, 2026 / 12:57 PM IST

నేదురుమల్లిపై కేసు నమోదు

TPT: వెంకటగిరి నియోజకవర్గ YCP సమన్వయకర్త నేదురుమల్లి రామ్ కుమార్ రెడ్డిపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఆదివారం ఆయన నివాసానికి వెళ్లిన పోలీసులు 41ఏ నోటీసులు అందజేశారు. గతంలో 27-12-2024న విద్యుత్ ఛార్జీల పెంపును నిరసిస్తూ నిర్వహించిన ర్యాలీలో ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రిలపై దుర్భాషలాడారని C.C నాయుడు ఫిర్యాదు చేసినట్లు పోలీసులు తెలిపారు.

February 22, 2026 / 12:52 PM IST

అవిలాలో టీడీపీ పార్లమెంట్ భవన భూమి పూజ

తిరుపతి రూరల్ మండలం అవిలాల పంచాయతీ పరిధిలో నిర్మాణం ప్రారంభమయ్యే నూతన టీడీపీ పార్టీ పార్లమెంటు భవన భూమి పూజ కార్యక్రమం ఆదివారం నిర్వహించారు. ముఖ్య అతిథిగా సత్యవేడు నియోజకవర్గ టీడీపీ కార్యక్రమ సమన్వయకర్త కూరపాటి శంకర్ రెడ్డి హాజరై ఘనంగా ప్రారంభించారు. కార్యక్రమంలో స్థానిక పార్టీ నేతలు, కార్యకర్తలు, పంచాయతీ ప్రజలు పాల్గొన్నారు.

February 22, 2026 / 12:47 PM IST

రేపు జిల్లాలో PGRS కార్యక్రమం: కలెక్టర్

NLR: ప్రజల నుంచి ఫిర్యాదులను స్వీకరించి వాటిని పరిష్కరించే ప్రజా ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థను సోమవారం కలెక్టరేట్లోని తిక్కన ప్రాంగణం నందు నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ హిమాన్షు శుక్లా ఒక ప్రకటనలో తెలిపారు. అర్జీదారులు తమ అర్జీలను వెబ్ సైట్ Meekosam.ap.gov.in ద్వారా నమోదు చేసుకోవచ్చన్నారు. ఇతర వివరాలకు సమాచారం కోసం 1100 కాల్ సంప్రదించవచ్చన్నారు.

February 22, 2026 / 12:43 PM IST

కొవ్వూరి బసివిరెడ్డి జీవిత చరిత్ర ఆదర్శం: ఎమ్మెల్యే

E.G: అనపర్తి ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి అపర దానకర్ణుడు కొవ్వూరి బసివిరెడ్డి జీవిత చరిత్రను ఇటీవల జరిగిన అసెంబ్లీలో ప్రస్తావించారు. ఈ సందర్బంగా అనపర్తి మండలం రామవరంలో ఎమ్మెల్యేను కొవ్వూరి బసివిరెడ్డి కుటుంబ సభ్యులు ఆదివారం మర్యాదపూర్వకంగా కలిసి కృతజ్ఞతలు తెలియజేశారు. ఆయన జీవిత చరిత్ర ఎందరికో ఆదర్శమని ఎమ్మెల్యే కొనియాడారు.

February 22, 2026 / 12:40 PM IST

పోలింగ్ సరళిపై శైలజానాథ్ సంచలన వ్యాఖ్యలు

ATP: గత ఎన్నికల్లో పోలింగ్ సరళిపై మాజీ మంత్రి శైలజానాథ్ ఆదివారం సంచలన వ్యాఖ్యలు చేశారు. సాయంత్రం 5 గంటలకు క్యూలైన్లలో ఉన్న వారికి కేవలం 30 వేల టోకెన్లు మాత్రమే జారీ అయ్యాయని పేర్కొన్నారు. మరి అర్ధరాత్రి సమయంలో 50 లక్షల ఓట్లు ఎలా నమోదయ్యాయని, ఆ ఓట్లు దెయ్యాలు లేదా ఆత్మలు వేశాయా అని ప్రశ్నించారు. ఎన్నికల అధికారులు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.

February 22, 2026 / 12:40 PM IST

అమ్మవారి పునః ప్రతిష్ట మహోత్సవంలో పాల్గొన్న ఎమ్మెల్యే

SKLM: మెలియాపుట్టి (M) గాథలవలస గ్రామంలో శ్రీ సవర పోలమ్మ అమ్మవారి ఆలయ పునః ప్రతిష్ట మహోత్సవం కార్యక్రమం ఆదివారం జరిగింది. ఆలయ కమిటీ సభ్యులు ఆహ్వానం మేరకు పాతపట్నం ఎమ్మెల్యే గోవిందరావు ముఖ్యఅతిథిగా పాల్గొని అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. గ్రామ దేవతల ఆశీస్సులు ఉంటే గ్రామం అన్ని రంగాల్లో అభివృద్ధి సాధిస్తుంది అని అన్నారు.

February 22, 2026 / 12:39 PM IST

భూమి పూజలో పాల్గొన్న మంత్రి

CTR: చిత్తూరులో టీడీపీ పార్టీ కార్యాలయ భవన నిర్మాణానికి భూమిపూజా కార్యక్రమాలు ఆదివారం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మంత్రి రాంప్రసాద్ రెడ్డి, ఎంపీ ప్రసాదరావు, ఎమ్మెల్యేలు గురజాల జగన్మోహన్, మురళీమోహన్ హాజరయ్యారు. పార్టీ బలోపేతానికి, కార్యకర్తల సమన్వయానికి కార్యాలయం కేంద్ర బిందువుగా నిలుస్తుందని మంత్రి అభిప్రాయపడ్డారు.

February 22, 2026 / 12:37 PM IST

ఘనంగా టీడీపీ నూతన జిల్లా కార్యాలయ భూమిపూజ

కడప జిల్లా TDP పార్టీ నూతన కార్యాలయ నిర్మాణానికి ఆదివారం ఘనంగా భూమిపూజ జరిగింది. జిల్లా అధ్యక్షుడు భూపేష్ రెడ్డి ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో కమలాపురం ఎమ్మెల్యే పుత్తా కృష్ణచైతన్య రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ వేడుకలో జిల్లా టీడీపీ నాయకులు, నగర కమిటీ సభ్యులు, క్లస్టర్, బూత్, యూనిట్ ఇన్‌చార్జ్‌లు తదితరులు పాల్గొన్నారు.

February 22, 2026 / 12:35 PM IST

చిత్తూరు జిల్లాలో కార్డెన్ అండ్ సెర్చ్

CTR: ఎస్పీ ఆదేశాల మేరకు జిల్లా వ్యాప్తంగా పోలీసులు ఆదివారం కార్డెన్ అండ్ సెర్చ్ నిర్వహించారు. నేరాలు, అక్రమ రవాణా నియంత్రణ లక్ష్యంగా చేపట్టిన ఈ తనిఖీల్లో 10 ద్విచక్ర వాహనాలు, 10 లీటర్ల సారా స్వాధీనం చేసుకున్నారు. అనుమానాస్పద వ్యక్తుల సమాచారం వెంటనే పోలీసులకు ఇవ్వాలని ప్రజలకు సూచించారు.

February 22, 2026 / 12:33 PM IST