• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »ఆంధ్రప్రదేశ్

సీఎం భద్రతా ఏర్పాట్లను పరిశీలించిన ఎస్పీ

గుంటూరు నగరానికి రానున్న రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పర్యటన నేపథ్యంలో జిల్లా పోలీసు శాఖ అప్రమత్తమైంది. బొమ్మిడాల నగర్‌లోని శ్రీ సత్యసాయి స్పిరిచువల్ సిటీలో ఇండియా పోస్ట్ ఆధ్వర్యంలో నిర్వహించనున్న “డాక్ సేవక్ సమ్మేళన్” కార్యక్రమానికి సీఎం హాజరుకానున్న సందర్భంగా జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ క్షేత్రస్థాయిలో భద్రతా ఏర్పాట్లను సమగ్రంగా పరిశీలించారు.

February 22, 2026 / 02:54 PM IST

ఘనంగా పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం

కృష్ణా: నందివాడ మండలం రుద్రపాక జిల్లా పరిషత్ పాఠశాలలో 1989,1990 సంవత్సర 10వ తరగతి పూర్వ విద్యార్థుల సమ్మేళనం ఆదివారం ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా దాదాపు 36 సంవత్సరాల క్రితం కలిసి చదువుకున్న విద్యార్థులు కలుసుకొని చిన్ననాటి జ్ఞాపకాలను వారు నెమరేసుకున్నారు. చదివిన సమయంలో చేసిన అల్లర్లు, ఉపాధ్యాయులతో ఉన్నటువంటి అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు.

February 22, 2026 / 02:54 PM IST

రోడ్డు భద్రత నియమాలపై వాహనదారులకు అవగాహన

కృష్ణా: మచిలీపట్నం–విజయవాడ జాతీయ రహదారిపై ట్రాఫిక్ సీఐ నున్న రాజు రోడ్డు భద్రత నియమాలపై ఆదివారం అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా సీఐ మాట్లాడుతూ.. రోడ్డు ప్రమాదాలను తగ్గించేందుకు ప్రతి ఒక్క వాహనదారుడు హెల్మెట్, సీట్ బెల్ట్ తప్పనిసరిగా వినియోగించాలని సూచించారు. హెల్మెట్, సీట్ బెల్ట్ వినియోగించకుండా వాహనాలు నడిపితే జరిమానా విధిస్తామన్నారు.

February 22, 2026 / 02:51 PM IST

అభివృద్ధి పనులను ప్రారంభించిన ఎమ్మెల్యే

NLR: కందుకూరులోని కోటారెడ్డి నగర్లో నూతనంగా నిర్మించిన సీసీ రోడ్డు, డ్రెయిన్లను ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు ఆదివారం ప్రారంభించారు. రూ.28.50 లక్షల వ్యయంతో వాటిని నిర్మించినట్లు మున్సిపల్ కమిషనర్ అనూష తెలిపారు. స్థానిక ప్రజల కోరిక మేరకు వీటి నిర్మాణం చేపట్టామని ఎమ్మెల్యే పేర్కొన్నారు.

February 22, 2026 / 02:50 PM IST

ఘనంగా డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ విగ్రహ శంకుస్థాపన

కృష్ణా: మొవ్వ గ్రామంలో డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ విగ్రహ శంకుస్థాపన కార్యక్రమం నేడు ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి పామర్రు ఎమ్మెల్యే వర్ల కుమార్ రాజా గారు ముఖ్యఅతిథిగా హాజరై శంకుస్థాపన చేశారు. అంబేద్కర్ ఆశయాలు అందరికీ స్ఫూర్తిదాయకమని ఆయన కొనియాడారు. ఈ కార్యక్రమంలో పలువురు నాయకులు, గ్రామస్తులు పాల్గొన్నారు.

February 22, 2026 / 02:50 PM IST

పరిగిలో సీసీ రోడ్ల నిర్మాణానికి భూమి పూజ

సత్యసాయి: పరిగి మండలంలో రూ. 2.10 కోట్ల నిధులతో పలు సీసీ రోడ్ల నిర్మాణ పనులకు ఆదివారం భూమి పూజ చేశారు. మండల టీడీపీ కన్వీనర్‌ గోవింద రెడ్డి మాట్లాడుతూ.. పాపిరెడ్డిపల్లి నుంచి శ్రీరంగరాజుపల్లి వరకు రూ.1.20 కోట్లు, మధుగిరి రోడ్డు నుంచి పుట్టగూర్లపల్లి వరకు రూ. 90 లక్షల వ్యయంతో పనులు ప్రారంభిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు పాల్గొన్నారు.

February 22, 2026 / 02:50 PM IST

ఆర్గానిక్ ఫార్మింగ్ మేళాను ప్రారంభించిన ఎంపీ

NTR: విజయవాడ ఇందిరాగాంధీ స్టేడియంలో నిర్వహించిన ఆర్గానిక్ రైతోత్సవం, న్యాచురల్ ఫార్మింగ్ మేళాను ఎంపీ కేసినేని చిన్ని ఆదివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ.. రైతులు రసాయన ఎరువులు వాడకం తగ్గించాలనేది సీఎం చంద్రబాబు ఆకాంక్ష అని అన్నారు. ఆర్గానిక్ పద్ధతుల్లో వ్యవసాయం చేయడం ద్వారా అధిక ఆదాయం, నాణ్యమైన ఆహారం అందుతుందని తెలిపారు.

February 22, 2026 / 02:50 PM IST

రేపు యథావిధిగా రెవెన్యూ క్లినిక్: కలెక్టర్

E.G: రేపు జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ‘మీకోసం కార్యక్రమం’ (PGRS), రెవెన్యూ క్లినిక్ యథావిధిగా నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ కీర్తి చేకూరి ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లా కేంద్రంతో పాటు డివిజన్, మండల స్థాయిలలో కూడా ఈ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారన్నారు. అలాగే, నమోదైన అర్జీల పరిష్కారంపై ప్రత్యేక దృష్టి పెట్టాలని అధికారులను ఆదేశించారు.

February 22, 2026 / 02:50 PM IST

కాంగ్రెస్ కార్యాలయంపై దాడి పిరికిపంద చర్య

KRNL: దేవనకొండలో యూత్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఇవాళ నిర్వహించిన మీడియా సమావేశంలో కర్నూలులో కాంగ్రెస్ కార్యాలయంపై జరిగిన దాడిని జిల్లా అధ్యక్షుడు మహేంద్ర నాయుడు తీవ్రంగా ఖండించారు. నిరుద్యోగం, వాణిజ్య ఒప్పందాలపై ప్రశ్నిస్తే దాడులు చేయడం ప్రజాస్వామ్య విరుద్ధమని అన్నారు. దాడులతో కాంగ్రెస్ శ్రేణులను భయపెట్టలేరని హెచ్చరించారు.

February 22, 2026 / 02:48 PM IST

‘కార్మిక విధానాల కోసం ఐక్యంగా పోరాడాలి’

SKLM: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల కార్మిక వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా ఐక్యంగా పోరాడాలని సీఐటీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి తేజేశ్వరరావు, శ్రామిక మహిళ జిల్లా కన్వీనర్ నాగమణి పిలుపునిచ్చారు. ఆదివారం నరసన్నపేట ఎంపీడీవో కార్యాలయం వద్ద సీఐటీయూ విస్తృత సమావేశం జరిగింది. అంగన్వాడి, ఆశా, మధ్యాహ్నభోజనం, వివోఏ, తదితర స్కీం వర్కర్లకు వేతనాలు వెంటనే పెంచాలన్నారు.

February 22, 2026 / 02:44 PM IST

పరీక్ష కేంద్రాన్ని సందర్శించిన గిద్దలూరు CI

ప్రకాశం: రేపట్నుంచి ఇంటర్మీడియట్ పరీక్షలు జరగనున్న నేపథ్యంలో ఆదివారం కొమరోలు ప్రభుత్వ జూనియర్ కళాశాలను సీఐ రామకోటయ్య సందర్శించారు. పరీక్ష నిర్వహణ సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలను పోలీస్ సిబ్బందికి, నిర్వహణ అధికారులకు పలు సూచనలు ఇచ్చారు. పరీక్ష కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమలులో ఉంటుందని, ప్రజలు గమనించి గుంపులుగా ఉండొద్దని చెప్పారు.

February 22, 2026 / 02:41 PM IST

‘క్యాన్సర్‌‌ను సకాలంలో గుర్తించి చికిత్స పొందాలి’

కృష్ణా: క్యాన్సర్‌‌ను సకాలంలో గుర్తించి చికిత్స పొందాలని నియోజకవర్గ యువనాయకులు మండలి వెంకట్రామ్ అన్నారు. ఆదివారం చల్లపల్లి మండలం వక్కలగడ్డలో పీఏసీఎస్ చైర్మన్ మల్లుపెద్ది దుర్గామహేష్ ఆధ్వర్యంలో బసవతారకం ఇండో – అమెరికన్ క్యాన్సర్ హాస్పిటల్ వారిచే ఎన్టీఆర్ ట్రస్ట్ సహకారంతో ఏర్పాటు చేసిన ఉచిత క్యాన్సర్ పరీక్ష శిబిరాన్ని వెంకట్రామ్ ప్రారంభించారు.

February 22, 2026 / 02:41 PM IST

వైసీపీ కార్యాలయంలో అబుల్ కలాం ఆజాద్ వర్ధంతి

NTR: విజయవాడ పశ్చిమ నియోజకవర్గ వైసీపీ కార్యాలయంలో మౌలానా అబుల్ కలాం ఆజాద్ వర్ధంతి కార్యక్రమం ఆదివారం జరిగింది. ఈ సందర్భంగా మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ మాట్లాడుతూ.. భారతదేశ తొలి విద్యాశాఖ మంత్రిగా అబుల్ కలాం ఆజాద్ విద్యలో అనేక మార్పులు తీసుకువచ్చి, ప్రతి ఒక్కరూ చదువుకోవాలని సంకల్పంతో విధులు నిర్వహించారని కొనియాడారు.

February 22, 2026 / 02:41 PM IST

రేపు కలెక్టరేట్‌లో PGRS కార్యక్రమం: కలెక్టర్

కోనసీమ: అమలాపురం కలెక్టరేట్‌లో PGRS కార్యక్రమం యథావిధిగా జరుగుతుందని కలెక్టర్ మహేశ్ కుమార్ ఆదివారం తెలిపారు. కలెక్టరేట్‌తో పాటు ఆర్డీవో, తహసీల్దార్, మున్సిపల్ కార్యాలయాల్లోనూ ఈ కార్యక్రమం ఉంటుందని పేర్కొన్నారు. ప్రజలు తమ సమస్యలను అధికారుల దృష్టికి తీసుకువచ్చి నిర్ణీత సమయంలో పరిష్కరించుకోవాలని కోరారు.

February 22, 2026 / 02:40 PM IST

అన్నమయ్య: BED విద్యార్థిని ఆత్మహత్య

అన్నమయ్య: రైల్వే కోడూరులోని రంగనాయకుల పేటలో ఇవాళ B.Ed చదువుతున్న ఆమంచి భార్గవి (24) ఆత్మహత్య చేసుకుంది. స్థానికుల సమాచారం మేరకు ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మృతురాలి తల్లి పద్మ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు SI లక్ష్మీ ప్రసాల్ రెడ్డి తెలిపారు. ఆత్మహత్యకు గల కారణాలు తెలియాల్సి ఉంది.

February 22, 2026 / 02:33 PM IST