TPT: డయల్ యువర్ టీటీడీ ఈవో కార్యక్రమం ఈనెల 28వ తేదీ ఉదయం 9 నుంచి 10 గంటల వరకు తిరుమల అన్నమయ్య భవనంలో జరుగనుంది. భక్తులు తమ సందేహాలు, సూచనలు (ఫోన్ నం.0877- 2263261) టీటీడీ ఈవో జె. శ్యామలరావుకు తెలపాలని అధికారులు కోరారు. కావున ఈ విషయాన్ని గమనించి, ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని సూచించారు.
CTR: అమరజీవి పొట్టిశ్రీరాములు వర్ధంతి సభ ఆదివారం ఉదయం 10.30 గంటలకు స్థానిక గంగినేని పార్కు వద్దనున్న పొట్టిశ్రీరాములు విగ్రహం వద్ద జరగనుంది. ఈ విషయాన్ని పొట్టి శ్రీరాములు విగ్రహ స్థాపన కమిటీ ఉపాధ్యక్షులు కట్టమంచి బాలకృష్ణారెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. ఈ విషయాన్ని జిల్లా ప్రజలు గమనించి, ఈ కార్యక్రమంలో పాల్గొనాలని పిలుపునిచ్చారు.
CTR: కుప్పంలో ఎన్జీవో హోమ్లో మంగళవారం జాతీయ పింఛనర్ల దినోత్సవాన్ని నిర్వహిస్తున్నట్లు ఆ సంఘం అధ్యక్షులు పీజీ సెల్వం, ప్రధాన కార్యదర్శి గణేష్ పిళ్లై సంయుక్తంగా ఒక ప్రకటనలో తెలిపారు. కార్యక్రమంలో పింఛన్ దారులను సన్మానించనున్నట్లు తెలిపారు. కావున ఈ విషయాన్ని గమనించి, పింఛన్ దారులంతా పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు.
PPM: పార్వతీపురం నియోజకవర్గంలో సాగునీటి సంఘ చైర్మన్లు, మెంబర్లు ఏకగ్రీవంగా ఎన్నికైన వారిని ఎమ్మెల్యే విజయ్ చంద్ర అభినందించారు. ఏకగ్రీవంగా ఎన్నికైన పలువురు చైర్మన్లు, మెంబర్లు ఎమ్మెల్యేను కలిశారు. ఈ సందర్భంగా వారికి పుష్పగుచ్చాలు ఇచ్చి ఎమ్మెల్యే అభినందించారు. కూటమి ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలకు ఆదరణ లభిస్తుందని నీటి సంఘాలు పేర్కొన్నారు.
E.G: దేవరపల్లిలో కులమతాలకు అతీతంగా నియోజకవర్గ స్థాయిలో ఆదివారం సెమీ క్రిస్మస్ వేడుకలు నిర్వహిస్తున్నామని ఎమ్మెల్యే మద్దిపాటి వెంకట రాజు ఒక ప్రకటనలో పేర్కొన్నారు. కావున ఈ విషయాన్ని గమనించి నియోజకవర్గ ప్రజలు ఈ వేడుకలకు హాజరు కావాలని తెలిపారు. కుల మతాలకు అతీతంగా ఈ సెమీ క్రిస్మస్ వేడుకలను నిర్వహించనున్నట్లు తెలిపారు.
KRNL: పార్లమెంట్లో రాజ్యాంగంపై జరిగిన చర్చలో భాగంగా గత ఐదేళ్లలో ఏపీలో చీకటి పాలన జరిగిందని నంద్యాల MP డా. బైరెడ్డి శబరి విమర్శించారు. అంబేడ్కర్ రాజ్యాంగం ప్రకారం కాకుండా సొంత రాజ్యాంగంతో పాలించి, ప్రతి రంగాన్ని నాశనం చేశారని ఆరోపించారు. ఇవన్నీ భరించిన ప్రజలు ఇటీవలి ఎన్నికల్లో రాజ్యాంగాన్ని గెలిపించారని, జగన్ని ప్రజలు ఇంటికి పంపించారని శబరి ఆరోపించారు.
NDL: నంద్యాల కోర్టులో జాతీయ లోక్ అదాలత్ కార్యక్రమాన్ని కోర్టు ఆవరణలో నిర్వహించామని మూడవ అదనపు జిల్లా జడ్జి వాసు తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. లోక్ అదాలత్లో సీసీ కేసులు 92, సివిల్ కేసులు 41, క్రిమినల్ కేసులు 118, ఎక్సైజ్ 16 కేసులు చొప్పున మొత్తం 362 కేసులు పరిష్కారం అయ్యాయని న్యాయమూర్తి వాసు తెలిపారు.
PPM: ఇంధన పొదుపు అలవాటుగా మార్చుకోవాలని పార్వతీపురం జేసీ ఎస్ఎస్. శోభిక అన్నారు. శనివారం ఏపి తూర్పు ప్రాంత విద్యుత్ పంపిణీ సంస్థ ఆధ్వర్యంలో ఈ నెల 14 నుంచి 20 వరకు జరగనున్న జాతీయ ఇంధన పొదుపు వారోత్సవాల కార్యక్రమాన్ని జిల్లా కలెక్టర్ కార్యాలయ ఆవరణలో ఆమె జండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా ప్రతి ఒక్కరూ ఇంధన పొదుపు అలవాటుగా మార్చుకోవాలన్నారు.
ప్రకాశం: చీమకుర్తి మండలం ఆర్.ఎల్.పురం ఉపకేంద్రం పరిధిలోని నిర్వహణ పనులు చేపడుతున్నందున ఆదివారం ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు విద్యుత్ సరఫరా నిలిపివేస్తున్నట్లు డీఈఈ ఆర్.మోహన్ రావు తెలిపారు. బూదవాడ, ఆర్.ఎల్. పురం పరిధిలోని పరిశ్రమలకూ అంతరాయం కలుగుతుందని పేర్కొన్నారు. వినియోగదారులు సహకరించాలని కోరారు.
VSP: విశాఖలో ఏపీ ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ ఆధ్వర్యంలో శనివారం ఘనంగా ఎన్టీఆర్ వత్రోత్సవ వేడుకలు నిర్వహించారు. ఎన్టీఆర్ చిత్రపటానికి పూలమాలవేసి ఘన నివాళులర్పించారు. విశాఖ జిల్లా కోఆర్డినేటర్ పూతి వెంకటరెడ్డి మాట్లాడుతూ.. తెలుగు ప్రేక్షకుల గుండెల్లో గూడు కట్టుకొని, తెలుగు చిత్రపరిశ్రమ ఖ్యాతిని ప్రపంచానికి చాటిన వ్యక్తి ఎన్టీఆర్ అన్నారు.
BPT: భట్టిప్రోలు సాగునీటి వినియోగదారుల సంఘం డైరెక్టర్గా భట్టిప్రోలుకు చెందిన కుంచె వెంకటేశ్వరరావు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈయన భట్టిప్రోలు సాగునీటి సంఘం టీ.సీ-5కు శనివారం నామినేషన్ దాఖలు చేశారు. మరొక వ్యక్తి ఎవరూ నామినేషన్ దాఖలు చేయకపోవడంతో వెంకటేశ్వరరావు ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు ఎన్నికల అధికారి ప్రకటించారు.
PLD: రొంపిచర్ల మండలంలో సాగునీటి సంఘం ఎన్నికలు శనివారం నిర్వహించారు. తురుమెళ్లకు సంబంధించిన ఎన్నికలను వీరి పట్నంలో నిర్వహించారు. సాగునీటి సంఘం అధ్యక్షుడిగా చిరుమామిళ్ల మల్లికార్జునరావును ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా అధికారుల నుంచి ధ్రువీకరణ పత్రాన్ని ఆయన అందుకున్నారు. తన నియామకానికి సహకారం అందించిన నాయకులకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు.
VSP: యువతలో పోటీ తత్వాన్ని పెంపొందించేందుకు క్విజ్ పోటీలు దోహదపడతాయని అభ్యుదయ రచయితల సంఘం జిల్లా కార్యదర్శి అప్పలరాజు పేర్కొన్నారు. విశాఖ పుస్తక మహోత్సవంలో భాగంగా శనివారం టర్నర్స్ చౌల్ట్రీ వద్ద విద్యార్థులకు క్విజ్ పోటీలు నిర్వహించారు. భారత రాజ్యాంగం ప్రధాన అంశంగా పోటీలు జరిగాయి. నగరంలోని వివిధ కళాశాల విద్యార్థులు ఏడు గ్రూపులుగా పోటీల్లో పాల్గొన్నారు.
అన్నమయ్య: జిల్లాలోని రాయచోటి, మదనపల్లి, రాజంపేట సబ్ డివిజన్ల పరిధిలో జరిగిన సాగునీటి సంఘాల ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయనీ జిల్లా ఎస్పీ విద్యాసాగర్ నాయుడు తెలిపారు. ఈ మేరకు ఆయన ఓ ప్రకటన విడుదల చేశారు. ఎక్కడా ఎలాంటి గొడవలు ఘర్షణలు తలెత్తకుండా పటిష్టమైన పోలీసు భద్రత ఏర్పాట్లతో పాటు, ముందస్తు జాగ్రత్తలు తీసుకున్నామన్నారు.
కృష్ణా: ఎమ్మెల్యే యార్లగడ్డ ఆధ్వర్యంలో నిర్వహించిన జాబ్ మేళాకు నిరుద్యోగులు పోటెత్తారు. శనివారం ఎనికేపాడులో జరిగిన జాబ్ మేళాకు విశేష స్పందన లభించిందని నిర్వాహకులు తెలిపారు. ఈ మేళాలో హైదరాబాద్, బెంగళూరు, వైజాగ్కు చెందిన ప్రైవేటు కంపెనీలు పాల్గొన్నాయి. నియోజకవర్గం నుంచే కాకుండా జిల్లా నలుమూలల నుంచి నిరుద్యోగులు ఈ జాబ్ మేళాలో పాల్గొన్నట్లు పేర్కొన్నారు.