ఏపీలో ఒకేరోజు ఇద్దరు వ్యక్తులు వేర్వేరు ప్రాంతాల్లో గుండెపోటుతో మృతి చెందారు. 22 ఏళ్ల ఓ వ్యక్తి తిరుపతిలో మృతి చెందగా, 28 ఏళ్ల మరో వ్యక్తి కర్నూల్ జిల్లాలో మరణించాడు. రోజురోజుకు గుండెపోటుతో మృతి చెందుతున్న వారి సంఖ్య పెరగడం పట్ల ప్రజలు భయాందోళన చెందుతున్నారు.
టీడీపీ(TDP) నాయకుడు నారా లోకేష్(Nara Lokesh) యువగళం పాదయాత్రను చేపడుతున్న సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా ఆయన ఉమ్మడి చిత్తూరు జిల్లాలోని తనపల్లి వద్ద పాదయాత్ర(Paadayatra) కొనసాగిస్తున్నారు. తాజాగా ఆయన లెవల్ కాజ్ వే(Causeway)ని పరిశీలించారు. ఈ సందర్భంగా స్థానికులు ఆయనకు తమ సమస్యలు చెప్పుకున్నారు. 2021 నవంబర్లో వరదల వల్ల స్వర్ణముఖి(Swarnamukhi) నదిపై ఉన్న లెవల్ కాజ్ వే(Causeway)లు కొట్టుకుపోయాయని స...
చిత్తురు (Chittoor) జిల్లాలోని శెట్టిపల్లి సమీపంలో ఘెర రోడ్డు ప్రమాదం (road accident) చోటు చేసుకుంది. కుప్పం-పలమనేరు జాతీయ రహదారిపై లారీని కారు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ముగ్గురు విద్యార్థులు అక్కడికక్కడే మృతి చెందారు. శెగడిపల్లి మండలం గట్టిపల్లి వద్ద వేగంగా దూసుకొచ్చిన కారు అదుపుతప్పి ఎదురుగా వస్తున్న లారీని ఢీకొట్టింది.
వరంగల్ ఎంజీఎం ఆస్పత్రిలో సూసైడ్ అటెమ్ట్ కోసం ప్రయత్నించిన ప్రీతి ఫోన్ కాల్ సంచలన సంభాషణ ఒకటి వెలుగులోకి వచ్చింది. దీనిలో సైఫ్ వేధించినట్లు స్పష్టంగా ప్రీతి తన తల్లితో చెప్పడం బయటకు వచ్చింది. సీనియర్లు అందరూ ఒక్కటిగా ఉన్నారని, సైఫ్ తనతోపాటు అనేక మందిని వేధించినట్లు ఫోన్ సంభాషణలో తెలిపింది.
28 ఏళ్ల ఓ సాఫ్ట్ వేర్ ఇంజినీర్ జిమ్ కు వెళ్లి ఆకస్మాత్తుగా కూప్పకూలిపోయాడు. గమనించిన తన తోటి మిత్రులు అతన్ని లేపి వెంటనే ఆస్పత్రికి తీసుకెళ్లారు. కానీ అప్పటికే మృతి చెందినట్లు డాక్టర్లు తెలిపారు. ఈ విషాద ఘటన ఏపీలోని కర్నూల్ జిల్లా ఆదోనిలో చోటుచేసుకుంది.
ఏపీలోని గుంటూరు జిల్లాలో ఐటీ అధికారులమని 50 లక్షలు దోచుకున్న దుండగులను పోలీసులు అరెస్ట్ చేశారు. వారి నుంచి 50 లక్షల రూపాయలకు గాను రూ.48.30 లక్షల నగదు, అరకిలో గోల్డ్ కు గాను 132 గ్రాముల బంగారంను స్వాధీనం చేసుకున్నారు.
తెలంగాణలోని పెద్దపల్లి జిల్లా గోదావరిఖనిలో దారుణ సంఘటన వెలుగులోకి వచ్చింది. ఐదేళ్ల క్రితం డెలివరీ కోసం ఓ మహిళ ఓ ప్రైవేటు ఆస్పత్రికి వెళ్లగా ఆపరేషన్ చేసిన మహిళా డాక్టర్ కత్తెరను కడుపులోనే మర్చిపోయింది. గత ఐదేళ్లుగా నరకం అనుభవించిన మహిళ ఇటీవల స్కాన్ చేయించుకోగా అసలు విషయం తెలిసింది.
vallabhaneni vamsi on lokesh:టీడీపీ యువనేత నారా లోకేశ్ (lokesh) జూనియర్ ఎన్టీఆర్ను (jr ntr) పార్టీలోకి రావాలని ఇచ్చిన పిలుపు అగ్గిరాజేసింది. ఈ రోజు ఉదయమే మాజీమంత్రి కొడాలి నాని.. లోకేశ్ను ఏకీపారేశారు. ఇప్పుడు వల్లభనేని వంశీమోహన్ (vamsi) వంతు వచ్చింది. తెలుగుదేశం పార్టీ పెట్టింది జూనియర్ ఎన్టీఆర్ తాత నందమూరి తారక రామరావు అని పేర్కొన్నారు. మరీ ఆయనను పార్టీలోకి ఆహ్వానించేది ఏంటీ అంటూ దుయ్యబట్టారు.
murder in dachepalli:పల్నాడు జిల్లా గురజాలలో దారుణ హత్య జరిగింది. దాచేపల్లిలో గొడ్డలితో ముక్కలుగా నరికి హతమార్చారు. మృతదేహాన్ని దాచేపల్లి మోడల్ స్కూల్ సమీపంలో ఉన్న మిర్చి తోటలో దగ్ధం చేశాడు. వివాహేతర సంబంధ నేపథ్యంలో హత్య జరిగింది. మృతుడు కోటేశ్వరరావు (45) దాచేపల్లి నగర పంచాయితీలో పంప్ ఆపరేటర్ ( ఔట్ సోర్సింగ్) పనిచేసేవారని తెలుస్తోంది.
తెలంగాణలో నాన్ వెజ్ ప్రియులకు శుభవార్త. ఎందుకంటే త్వరలోనే మొదటిసారిగా హైదరాబాద్ పరిధిలో మటన్ క్యాంటీన్లను ఏర్పాటు చేయనున్నట్లు తెలంగాణ గొర్రెల, మేకల అభివృద్ది సంస్థ ఛైర్మన్ దూదిమెట్ల బాలరాజు యాదవ్ పేర్కొన్నారు. ఇప్పటికే ఏర్పాటు చేసిన ఫిష్ క్యాంటీన్లు సక్సెస్ అయిన క్రమంలో.. మటన్ క్యాంటీన్లను మార్చిలో ప్రారంభించనున్నట్లు వెల్లడించారు.
kodali nani on lokesh:టీడీపీ యువ నేత నారా లోకేశ్పై (lokesh) మాజీ మంత్రి కొడాలి నాని (kodali nani) తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. జూనియర్ ఎన్టీఆర్ను (jr.ntr) టీడీపీలో చేరమని లోకేశ్ (lokesh) అడగడం ఏంటీ అని మండిపడ్డారు. ఆ పార్టీ ఆయన తాత పెట్టింది అని పేర్కొన్నారు. లోకేశ్ (lokesh) ఆహ్వానించడం ఏంటో అర్థం కావడం లేదన్నారు.
తిరుమల(Tirumala) పుణ్యక్షేత్రం పర్యావరణ పరిరక్షణకు అనేక రకాల చర్యలు తీసుకుంటోంది. సంపూర్ణ ప్లాస్టిక్ నిషేధంలో భాగంగా టీటీడీ(TTD) ప్రత్యేక నిర్ణయాలు తీసుకుంది. తిరుమలలో ప్లాస్టిక్ వినియోగాన్ని తగ్గించేందుకు మరో వినూత్న ప్రయత్నం చేస్తోంది. అందులో భాగంగా శ్రీవారి లడ్డూ ప్రసాదాన్ని(Srivari laddu prasadam) ఇక నుంచి తాటాకు బుట్టల్లో భక్తులకు అందించనుంది.
వైయస్ వివేకానంద రెడ్డి హత్య కేసు (YS Vivekananda Reddy murder case) విచారణలో భాగంగా ఎంపీ అవినాష్ రెడ్డి తండ్రి వైయస్ భాస్కర్ రెడ్డి (YS Bhaskar Reddy)కి నోటీసులు ఇచ్చింది సీబీఐ (CBI).
ఫోన్ కూడా చేయడం లేదని ప్రశ్నించడంతో ఆవేశంలో దేవేంద్ర రెడ్డి చేసిన దారుణాన్ని వివరించాడు. ఇది విన్న తాత శివారెడ్డి హతాశయుడయ్యాడు. వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చాడు. పోలీసులు దేవేంద్ర రెడ్డిని తీసుకుని వెళ్లి అటవీ ప్రాంతంలో మృతదేహం కోసం పరిశీలించారు. మొదటి రోజు ఆనవాళ్లు లభించకపోవడంతో రెండో రోజు ఆమె శరీర అవయవాలు లభించాయి.