• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »ఆంధ్రప్రదేశ్

బాపిరాజును కలిసిన అప్కాబ్ చైర్మెన్

E.G: నల్లజర్లలో ముళ్ళపూడి బాపిరాజును అప్కాబ్ చైర్మెన్ గన్ని వీరాంజనేయులు కలిసారు. ప్రస్తుత రాజకీయ పరిస్థితులపై చర్చించారు. స్థానిక కార్యకర్తలతో, నేతలతో భేటీ అయ్యారు. వచ్చే మున్సిపల్, పంచాయితీ ఎన్నికల నేపథ్యంలో వారికి దిశ నిర్దేశం చేశారు. టిడిపి జాతీయ ఉపాధ్యక్షులుగా నియమితులైన బాపిరాజును ఈ సందర్భంగా గన్ని అభినందించారు 

April 19, 2026 / 11:15 AM IST

తాగునీటి కొరత తలెత్తకుండా చూడాలి: మంత్రి

NDL: బనగానపల్లె ఎంపీడీవో కార్యాలయంలో ఆదివారం మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి RWS అధికారులతో వేసవిలో తాగునీటి ఎద్దడి నివారణపై సమీక్షా సమావేశం నిర్వహించారు. తాగునీటి కొరత రాకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని అధికారులను మంత్రి ఆదేశించారు. ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా క్షేత్రస్థాయిలో పర్యవేక్షణ పెంచాలన్నారు. సమస్యలు వచ్చిన వెంటనే స్పందించాలన్నారు.

April 19, 2026 / 11:15 AM IST

అమరావతి ఐకానిక్ టవర్లకు టెండర్లు

GNTR: అమరావతిలోని ఐదు ఐకానిక్ భవనాల పూర్తికి ప్రభుత్వం కీలక అడుగు వేసింది. టవర్ 1 నుండి 4 వరకు, జీఏడీ టవర్‌లలో విద్యుత్, ప్లంబింగ్, ఏసీ, ఫైర్ సేఫ్టీ (MEP) పనుల కోసం టెండర్లు పిలిచింది. రూ. 1,856 కోట్లకు పైగా అంచనాతో ఈ పనులు చేపట్టనున్నారు. ఈ పనులను 18 నెలల్లోగా పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. దీనివల్ల కీలక కార్యాలయాల భవనాలు త్వరలోనే అందుబాటులోకి రానున్నాయి.

April 19, 2026 / 11:12 AM IST

అధికారులకు కలెక్టర్ కీలక ఆదేశాలు

KKD: అధికారులు మొక్కుబడి తంతుగా కాకుండా అంకిత భావంతో జల సంరక్షణకు కృషి చేయాలని జిల్లా కలెక్టర్ హరేంద్ర ప్రసాద్ కోరారు. పెద్దాపురం మండల పరిషత్‌లో శనివారం జలధార జల సంరక్షణపై అధికారులకు దిశ నిర్దేశం చేశారు. భావితరాల కోసం జలవనరులను సంరక్షించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని కలెక్టర్ హరేంద్ర ప్రసాద్ తెలిపారు.

April 19, 2026 / 11:12 AM IST

ఎలమంచిలిలో BJP శ్రేణులు ర్యాలీ

AKP: ఎలమంచిలిలో మహిళా రిజర్వేషన్ బిల్లుకు కాంగ్రెస్ మిత్రపక్షాల వ్యతిరేకతపై బీజేపీ నిరసన వ్యక్తం చేసింది. రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఆడారి ఆనంద్ కుమార్, జాతీయ కౌన్సిల్ సభ్యురాలు పిల్లా రామకుమారి నేతృత్వంలో బైక్ ర్యాలీ నిర్వహించారు. అనంతరం పార్టీ జెండా ఎగురవేసి మహిళా సాధికారతకు ఈ బిల్లు ఎంతో కీలకమని తెలిపారు. ఈ కార్యక్రమంలో పార్టీ శ్రేణులు పాల్గొన్నారు.

April 19, 2026 / 11:10 AM IST

స్వచ్ఛతను కాపాడడం అందరి బాధ్యత: కమిషనర్

NDL: నందికొట్కూరు పట్టణ పరిశుభ్రతకు ప్రత్యేక ప్రణాళికను అమలు చేస్తున్నట్లు మున్సిపల్ కమిషనర్ వెంకటరామిరెడ్డి పేర్కొన్నారు. ఆదివారం స్వయంగా వీధులలో తిరుగుతూ చెత్త సేకరణ పనులను పర్యవేక్షించారు. ఎక్కడా చెత్త పేరుకుపోకుండా వెంటనే తరలించేలా చర్యలు తీసుకోవాలని సిబ్బందిని ఆదేశించారు. స్వచ్ఛతను కాపాడడం అందరి బాధ్యత అని తెలిపారు.

April 19, 2026 / 11:09 AM IST

సమ్మర్ ఎఫెక్ట్.. ముంజెలకు పెరిగిన గిరాకీ

W.G: భానుడి భగభగలతో అల్లాడుతున్న ప్రజలకు తాటి ముంజెలు ఉపశమనం కలిగిస్తున్నాయి. ఆకివీడు ప్రాంతంలో ముంజెలకు డిమాండ్ అమాంతం పెరిగింది. వేసవిలో మాత్రమే లభించే ఈ ప్రకృతి ప్రసాదాన్ని ప్రజలు ఇష్టంగా కొనుగోలు చేస్తున్నారు. ప్రస్తుతం మార్కెట్లో ఒక్కో కాయ ధర రూ.25 వరకు పలుకుతుండగా, వ్యాపారులు ముంజెలను తీసి డజన్ల లెక్కన కూడా విక్రయిస్తున్నారు.

April 19, 2026 / 11:07 AM IST

మాజీ డిప్యూటీ సీఎంకు అభినందనల వెల్లువ

PPM: YCP రాష్ట్ర పొలిటికల్ అడ్వైజరీ కమిటీ సభ్యురాలిగా మాజీ ఉప ముఖ్యమంత్రి పాముల పుష్పశ్రీవాణి నియామకం పై పార్టీ శ్రేణులు హర్షం వ్యక్తంచేస్తున్నాయి. తమ నాయకురాలికి కొత్త బాధ్యతలు అప్పగించిన పార్టీ జాతీయ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌కు కురుపాం నియోజకవర్గ ప్రజలు కృతజ్ఞతలు తెలిపారు.

April 19, 2026 / 11:07 AM IST

శ్రీశైలానికి KRMB ఛైర్మన్ రాక

NDL: ఈనెల 21న శ్రీశైలం డ్యామ్‌ను కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డ్ ఛైర్మన్ సుబ్రాంగ్ షూ బిశ్వాస్ పరిశీలించనున్నారు. 20న శ్రీశైలం చేరుకొని అక్కడే బస చేస్తారు. క్షేత్రస్థాయిలో డ్యామ్‌ను సందర్శించి, జల వనరుల శాఖ ఇరు రాష్ట్రాల అధికారులతో జలాశయం భద్రతపై సమీక్షించనున్నారు. అలాగే AP, TG రాష్ట్రాల మధ్య కృష్ణా నీటి అంశంలో నెలకొన్న వివదంపైనా చర్చించనున్నారు.

April 19, 2026 / 11:04 AM IST

సీనియర్ పాత్రికేయుడు రాజేష్ అకాల మరణం

VZM: సీనియర్ పాత్రికేయుడు సుంకర రాజేష్(53) అనారోగ్యం కారణంగా ఈ తెల్లవారుజామున అకాల మరణం చెందారు. తొలుత ఈనాడు, తరువాత సాక్షి దినపత్రికలో ఆయన పని చేశారు. విషయం తెలుసుకున్న జర్నలిస్ట్ సంక్షేమ సంఘం అధ్యక్షుడు లింగాల నరసింగరావు వారి నివాసానికి వెళ్లి రాజేష్ మృత దేహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. కుటుంబ సభ్యులకు దైర్యం చెప్పారు.

April 19, 2026 / 11:03 AM IST

గోపులాపురంలో గుండెపోటుతో రైతు మృతి

కడప: కమలాపురం(M) గోపులాపురం గ్రామానికి చెందిన రైతు మీగడ నారాయణరెడ్డి (65) శనివారం రాత్రి గుండెపోటుతో మృతి చెందినట్లు కుటుంబీకులు తెలిపారు. వారి వివరాల మేరకు.. ఆయనకు అకస్మాత్తుగా ఛాతినొప్పి రావడంతో వెంటనే ఆసుపత్రికి తరలించారు. అయితే మార్గమధ్యంలోనే ఆయన ప్రాణాలు కోల్పోయాడు.

April 19, 2026 / 11:02 AM IST

గౌతు లచ్చన్న సేవలు చిరస్మరణీయం

SKLM: స్వాతంత్ర్య సమరయోధుడు, సామాజిక సేవకుడు సర్దార్ గౌతు లచ్చన్న వర్థంతి సందర్భంగా పలాస మున్సిపాలిటీలోని ఆయన విగ్రహానికి ఏపీ టీపీసీ ఛైర్మన్ వజ్జ బాబూరావు ఆదివారం పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఆయన మాట్లాడుతూ.. గౌతు లచ్చన్న చేసిన సేవలు ఎప్పటికీ మరువలేని వని, ఆయన చూపిన మార్గంలో నడవాలని పిలుపునిచ్చారు. స్థానిక TDP నాయకులు ఆయన అభిమానులు పాల్గొన్నారు.

April 19, 2026 / 11:00 AM IST

ఆ గ్రామాలకు శాపంగా మారిన తాగునీటి సమస్య

KRNL: ఆదోని పరిధిలోని పలు గ్రామాల్లో తాగునీటి సమస్య తీవ్రంగా మారిందని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కుప్పగల్, పెసలబండ, ఆస్పరి, మండిగిరి వంటి స్కీంల పరిధిలో గ్రామాలకు సక్రమంగా నీటి సరఫరా లేక ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. స్కీంల నిర్వహణ బాధ్యతలు చేపట్టిన కాంట్రాక్టర్లు 20-40% తక్కువ రేటుకు పనులు తీసుకుని, వర్కర్లకు జీతాలు సైతం ఇవ్వడం లేదన్నారు.

April 19, 2026 / 11:00 AM IST

శిథిల గ్రంథాలయం… భయంతో పాఠకులు!

VZM: గంట్యాడ మండల కేంద్రంలోని గ్రంథాలయం ప్రస్తుతం ప్రమాదకర స్థితిలో ఉంది. భవనం స్లాబ్ నుంచి పెచ్చులు ఊడిపడుతున్న కారణంగా పాఠకులు, సిబ్బంది ఆందోళన చెందుతున్నారు. ఎప్పుడైనా ప్రమాదం జరిగే అవకాశముండటంతో వెంటనే కొత్త భవనం నిర్మించాలని స్థానికులు అధికారులను కోరుతున్నారు.

April 19, 2026 / 10:47 AM IST

పేరుపాలెం బీచ్‌లో పర్యాటకుల సందడి

WG: పేరుపాలెం తీరం ఆదివారం సెలవు దినం కావడంతో జనసంద్రమైంది. జిల్లా నలుమూలల నుంచి పర్యాటకులు భారీ సంఖ్యలో తరలివచ్చారు. కుటుంబ సమేతంగా విచ్చేసిన సందర్శకులు సముద్ర స్నానాలు చేస్తూ, ఇసుక తిన్నెలపై సరదాగా గడుపుతూ సేదతీరారు. తీరంలో యువత కేరింతలు కొడుతూ ఆటపాటలతో సందడి చేశారు. పర్యాటకులు సమీపంలోని కొబ్బరి తోటల్లో వన భోజనాలు ఏర్పాటు చేసుకుని ఆనందంగా గడిపారు.

April 19, 2026 / 10:37 AM IST