• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »ఆంధ్రప్రదేశ్

విద్యుత్ బిల్లులు సకాలంలో చెల్లించాలి: ఏఈ

KKD: విద్యుత్ బిల్లులు సకాలంలో చెల్లించి సహకరించాలని ఆ శాఖ ఏఈ మాధురి కోరారు. జగ్గంపేట ఎస్సీ కాలనీలో మంగళవారం లైన్మెన్ శివప్రసాద్, సిబ్బందితో కలసి బకాయిలు ఉన్న ఇళ్లకు వెళ్లి వసూలు కార్యక్రమం చేపట్టారు. నెలలు తరబడి బిల్లులు చెల్లింపులు చేయని పలు కనెక్షన్లు నిలుపుదల చేసినట్లు ఆమె తెలిపారు.

February 25, 2026 / 08:00 AM IST

డిగ్రీ పరీక్షల్లో ఇద్దరు విద్యార్థులు డిబార్

KRNL: రాయలసీమ యూనివర్సిటీ పరిధిలో మంగళవారం నిర్వహించిన డిగ్రీ ఫస్ట్ సెమిస్టర్ పరీక్షలో ఇద్దరు విద్యార్థులు డిబార్ అయ్యారు. డోన్ గవర్నమెంట్, పత్తికొండ రాఘవేంద్ర డిగ్రీ కాలేజీల్లో జరుగుతున్న సెంటర్లలో ఒక్కొక్కరు చొప్పున డిబార్ అయ్యారు. అటు, డిగ్రీ ఫస్ట్ ఇయర్ పరీక్షకు 89 శాతం మంది, బీటెక్ పరీక్షకు 98 శాతం, లా పరీక్షలకు 92 శాతం విద్యార్థులు హాజరయ్యారు.

February 25, 2026 / 08:00 AM IST

తొలిరోజు ఇంటర్ పరీక్షలకు 642 మంది విద్యార్థులు గైర్హాజరు

PLD: జిల్లావ్యాప్తంగా మంగళవారం ఇంటర్మీడియట్ ద్వితీయ సంవత్సరం పరీక్షలు ప్రశాంతంగా ప్రారంభమయ్యాయి. జనరల్ కోర్సుల్లో నమోదైన 16,088 మంది విద్యార్థులకు గాను 15,523 మంది హాజరయ్యారు. అలాగే వృత్తి విద్యా కోర్సుల్లో 950 మందికి గాను 880 మంది పరీక్ష రాశారు. మొదటి రోజు పరీక్షకు మొత్తం 642 మంది విద్యార్థులు గైర్హాజరైనట్లు విద్యాశాఖ అధికారి నీలావతి దేవి తెలిపారు.

February 25, 2026 / 07:51 AM IST

మండపేట సమస్యలపై పవన్ కళ్యాణ్‌కు వినతి

కోనసీమ: వెలగపూడి సచివాలయంలో మంగళవారం శాసనసభ విరామ సమయంలో ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్‌ను ఎమ్మెల్యే వేగుళ్ల జోగేశ్వరరావు, నీటిపారుదల అభివృద్ధి సంస్థ ఛైర్మన్ వేగుళ్ల లీలాకృష్ణలు మర్యాదపూర్వకంగా కలిశారు. మండపేట నియోజకవర్గంలో ప్రజలు ఎదుర్కొంటున్న పలు సమస్యలను పవన్ కళ్యాణ్‌కు వివరించారు. వీటి పరిష్కారానికి అవసరమైన చర్యలు తీసుకోవాలని కోరుతూ వినతిపత్రం అందజేశారు.

February 25, 2026 / 07:50 AM IST

కేంద్ర నోడల్ అధికారిగా నీరజ్ కుమార్ గయాగి

VZM: భారత ప్రభుత్వం పీఎం శ్రీ పథకం అమలును పరిశీలించేందుకు దేశవ్యాప్తంగా జాయింట్ సెక్రటరీ హోదా కలిగిన సుమారు 170 మంది అధికారులను నోడల్ అధికారులుగా నియమించిందని కలెక్టర్ రామ సుందర్ రెడ్డి మంగళవారం తెలిపారు. జిల్లా కేంద్ర నోడల్ అధికారిగా జాయింట్ సెక్రటరీగా నీరజ్ కుమార్ గయాగి నియమితులైనట్లు చెప్పారు.

February 25, 2026 / 07:48 AM IST

జగన్‌తో కదిరి వైసీపీ ఇంఛార్జ్ భేటీ

సత్యసాయి: పులివెందుల పార్టీ కార్యాలయంలో మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని కదిరి నియోజకవర్గ సమన్వయకర్త బి.ఎస్. మక్బూల్ అహ్మద్ కలిశారు. కదిరి నియోజకవర్గంలోని తాజా రాజకీయ పరిస్థితులు, పార్టీ బలోపేతానికి తీసుకుంటున్న చర్యలను జగన్‌కు వివరించారు. వాణిజ్య విభాగం అధ్యక్షులు పీఎండీ షకీల్ కూడా ఈ భేటీలో పాల్గొని నియోజకవర్గ అభివృద్ధి అంశాలపై చర్చించారు.

February 25, 2026 / 07:47 AM IST

రైల్వే గేట్ వద్ద వాహనదారులకు కౌన్సిలింగ్

కృష్ణా: గుడివాడ మండలం మల్లాయిపాలెం రైల్వే గేట్ వద్ద ఎస్సై చంటిబాబు బుధవారం వాహన తనిఖీలు చేపట్టారు. ప్రజల భద్రత దృష్ట్యా ఓవర్ లోడ్‌తో ప్రయాణిస్తున్న ప్రయాణికుల వాహనాలను గుర్తించి డ్రైవర్లకు కౌన్సిలింగ్ ఇచ్చారు. ఎస్సై మాట్లాడుతూ.. వాహనదారులు రోడ్డు భద్రత నిబంధనలను తప్పనిసరిగా పాటించాలని, అనుమతించిన పరిమితికి మేరకే ప్రయాణికులను తీసుకువెళ్లాలన్నారు.

February 25, 2026 / 07:45 AM IST

శాసనమండలిలో ఎమ్మెల్సీ గళం

W.G: ప్రభుత్వ జూనియర్, డిగ్రీ, పాలిటెక్నిక్, వర్సిటీల్లో పనిచేస్తున్న కాంట్రాక్ట్ అధ్యాపకుల సమస్యలను ఎమ్మెల్సీ గోపిమూర్తి మంగళవారం శాసనమండలిలో ప్రస్తావించారు. ఏళ్ల తరబడి సేవలందిస్తున్న వీరిని, అసిస్టెంట్ ప్రొఫెసర్లను వెంటనే క్రమబద్ధీకరించాలన్నారు. ఎయిడెడ్ కళాశాలల్లోని అన్-ఎయిడెడ్ సిబ్బందిని సైతం రెగ్యులర్ చేయాలని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లారు.

February 25, 2026 / 07:40 AM IST

పారిశుద్ధ్య కార్మికులకు పనిముట్లు అందజేత

ATP: గుంతకల్లు మున్సిపాలిటీలో పనిచేసే పారిశుద్ధ్య కార్మికులకు బుధవారం మున్సిపల్ కమిషనర్ లక్ష్మీదేవి పనిముట్లను అందజేశారు. అనంతరం కమిషనర్ మాట్లాడుతూ.. పారిశుద్ధ్య కార్మికుల భద్రత, సామర్థ్యాన్ని పెంచేందుకు పనిముట్లు, రక్షణ పరికరాలను అందజేశామన్నారు. ఈ పరికరాలు నగర స్వచ్ఛతకు దోహదపడతాయన్నారు.

February 25, 2026 / 07:40 AM IST

ప్రవేశ పరీక్ష ఈనెల 8కి వాయిదా

AKP: కశింకోట మండలం తాళ్లపాలెంలో బీఆర్ అంబేద్కర్ సాంఘిక సంక్షేమ శాఖ బాలికల గురుకుల పాఠశాలలో మిగులు సీట్ల భర్తీకి వచ్చే నెల 2 నిర్వహించనున్న ప్రవేశపరీక్షను 8వ తేదీకి వాయిదా వేసినట్లు కళాశాల ప్రిన్సిపాల్ రత్నావళి మంగళవారం తెలిపారు. ఆరోజు 6, 7 తరగతులకు ఉదయం 10 గంటల నుంచి 11:30 గంటల వరకు, 8, 9,10 తరగతులకు మధ్యాహ్నం 2 నుంచి 3.30 గంటల వరకు జరుగుతుందన్నారు.

February 25, 2026 / 07:39 AM IST

తిరుపతికి వెళ్లే వారికి ALERT

TPT: తిరుపతి ప్రధాన స్టేషన్‌లో రద్దీ తగ్గించేందుకు అధికారులు కీలక నిర్ణయం తీసుకున్నారు. అరక్కోణం, చెన్నై సెంట్రల్ మెమూ రైళ్లు ఇకపై తిరుపతికి రావు. తిరుచానూరు రైల్వే స్టేషన్ నుంచే ఇవి రాకపోకలు సాగించనున్నాయి. ఆయా మార్గాల్లో రాకపోకలు సాగించే ప్రయాణికులు ఇకపై తిరుపతి బదులు తిరుచానూరు స్టేషన్‌కు వెళ్లాల్సి ఉంటుంది.

February 25, 2026 / 07:38 AM IST

వ్యభిచారం నిర్వహిస్తున్న మహిళ అరెస్ట్

NDL: నంద్యాలలోని బాలాజీ కాంప్లెక్స్ ప్రాంతంలో వ్యభిచారం నిర్వహిస్తున్న ఓ మహిళను మంగళవారం సాయంత్రం అరెస్ట్ చేసినట్లు వన్ టౌన్ సీఐ సుధాకర్ రెడ్డి తెలిపారు. వ్యభిచారం జరుగుతుందనే సమాచారం మేరకు దాడలు చేసి ఒక మహిళను అరెస్టు చేసి, ఆమె అనుచరులను అదుపులోకి తీసుకున్నామన్నారు. వారిపై కేసు నమోదు చేశామన్నారు. కాగా, ఆ మహిళపై ఇదివరకే పలు కేసులు ఉన్నాయన్నారు.

February 25, 2026 / 07:36 AM IST

వైద్యారోగ్యశాఖలో పోస్టులకు దరఖాస్తుల ఆహ్వానం

ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా నేషనల్ అర్బన్ హెల్త్ మిషన్ రాష్ట్రీయ బాల స్వాస్థ్య కార్యక్రమంలో భాగంగా పలు పోస్టులకు నోటిఫికేషన్ జారీ చేశారని డీఎంహెచ్‌వో డా. నరసింహ నాయక్ మంగళవారం తెలిపారు. మొత్తం 9 పోస్టులకు అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతున్నామన్నారు. మార్చి 2 నుంచి 11వ తేదీ వరకూ కాకినాడ DMHO కార్యా లయంలో దరఖాస్తులు అందజేయాలని సూచించారు.

February 25, 2026 / 07:30 AM IST

కౌతాళంలో ఆగని రాజీనామాల పర్వం

KRNL: కౌతాళంలో రాజీనామాల పర్వం ఆగడం లేదు. కుంబలనూరు, దోమలదిన్నె సర్పంచులు వీరేశ్, మమత TDP సభ్యత్వానికి రాజీనామా చేశారు. ఉరుకుంద శ్రీ లక్ష్మీనరసింహ ఈరన్న స్వామి దేవస్థానం ట్రస్ట్ బోర్డు ఛైర్మన్ పదవి విషయంలో పార్టీ అధిష్ఠానం తీసుకున్న నిర్ణయాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని వారు తెలిపారు. కష్టపడ్డ నాయకులకు నియోజకవర్గంలో సముచిత స్థానం లభించడం లేదన్నారు.

February 25, 2026 / 07:30 AM IST

నేడు రామచంద్రపురంలో జాబ్ మేళా

కోనసీమ: రామచంద్రపురంలో బుధవారం జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు మంత్రి వాసంశెట్టి సుభాష్ కార్యాలయం సిబ్బంది వెల్లడించారు. 10వ తరగతి, డిప్లొమా, డిగ్రీ అర్హత ఉండి, 18-35 ఏళ్ల వయస్సు గల అభ్యర్థులు ఈ మేళాకు హాజరు కావచ్చన్నారు. ఆసక్తి గల అభ్యర్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని మంత్రి సుభాష్ సూచించారు. నిరుద్యోగులకు ఉపాధి కల్పించడమే తమ లక్ష్యమని ఆయన పేర్కొన్నారు.

February 25, 2026 / 07:30 AM IST