GNTR: మంగళగిరి మెయిన్ బజార్లో ట్రాఫిక్ సమస్య తీవ్రంగా ఉందని స్థానికులు ఆందోళన వ్యక్తం చేశారు. రద్దీ వేళల్లో భారీ సరుకు రవాణా వాహనాలు తిరగడమే ప్రధాన కారణం. గాలిగోపురం నుంచి మిద్దె సెంటర్ వరకు రోడ్లపై వాహనాలు అడ్డదిడ్డంగా నిలుపుతున్నారు. దీంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. రద్దీ లేని సమయాల్లోనే సరుకు రవాణాకు అనుమతించాలని కోరుతున్నారు.
GNTR: ప్రజా సమస్యల పరిష్కారం కోసం సోమవారం నగరపాలక సంస్థ కార్యాలయంలో PGRS కార్యక్రమం నిర్వహించనున్నట్లు GMC కమిషనర్ కె. మయూర్ అశోక్ వెల్లడించారు. ఉదయం 10.30 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు ఫిర్యాదులు స్వీకరిస్తామని తెలిపారు. ప్రజలు హాజరై తమ సమస్యలను తెలియజేసి పరిష్కారం పొందాలని సూచించారు.
WG: మొగల్తూరు మండలంలోని ప్రముఖ పర్యాటక కేంద్రం పేరుపాలెం బీచ్కు ఆదివారం పర్యాటకులు భారీగా తరలివచ్చారు. జిల్లా నలుమూలల నుంచి వచ్చిన సందర్శకులు కుటుంబ సభ్యులతో కలిసి సముద్ర స్నానాలు చేస్తూ ఇసుక తిన్నెలపై సరదాగా గడిపారు. తీరంలోని ఆలయాలను సందర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు బందోబస్తు నిర్వహించారు.
E.G: నల్లజర్ల మండలం పోతవరంలో ఏర్పాటు చేయనున్న విలేజ్ హెల్త్ క్లినిక్ & వాటర్ ట్యాంకులను గోపాలపురం MLA మద్దిపాటి వెంకటరాజు ఆదివారం శంకుస్థాపన చేశారు. విలేజ్ హెల్త్ క్లినిక్ ద్వారా గ్రామ ప్రజలకు ఆధునిక వైద్య సదుపాయాలు అందేలా కేంద్రాన్ని అభివృద్ధి చేయనున్నట్లు తెలిపారు. జల జీవన్ మిషన్ ద్వారా గ్రామీణ ప్రజలకు శాశ్వతంగా మంచినీరు అందించనున్నట్లు చెప్పారు.
అన్నమయ్య: మదనపల్లి కలెక్టరేట్లో ఉయ్యాలవాడ నరసింహారెడ్డి వర్ధంతి కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన జిల్లా రెవెన్యూ అధికారి మధుసూదన రావు, నరసింహారెడ్డి జీవితం యువతకు స్ఫూర్తి అని పేర్కొన్నారు. బ్రిటిష్ పాలనకు వ్యతిరేకంగా తొలి సాయుధ పోరాట యోధుడిగా ఆయన చరిత్రలో చిరస్థాయిగా నిలిచారని తెలిపారు.అధికారులు, విద్యార్థులు పాల్గొన్నారు.
KRNL: ప్రజల్లో ఆరోగ్యం,ఆనందాన్ని పెంపొందించాలనే లక్ష్యంతో ప్రభుత్వం హ్యాపీ సండే కార్యక్రమాన్ని పునఃప్రారంభించినట్లు కమిషనర్ పి.విశ్వనాథ్ తెలిపారు. ఆదివారం కొండారెడ్డి బురుజు వద్దనున్న పార్కులో తొలి హ్యాపీ సండే కార్యక్రమాన్ని నిర్వహించారు. యోగా, చెస్, కబడ్డీ, సంగీత, నృత్య ప్రదర్శనలు నిర్వహించి ఉద్యవన సందర్శకుల్లో ఉత్సాహాన్ని నింపారు.
NDL: ఉయ్యాలవాడ నరసింహారెడ్డి త్యాగం యువతకు స్ఫూర్తిదాయకమని, స్వాతంత్య్ర సమరయోధుల త్యాగాలను స్మరించుకోవడం ప్రతి భారతీయుడి బాధ్యత అని జిల్లా రెవెన్యూ అధికారి డి. రాము నాయక్ అన్నారు. ఆదివారం కలెక్టరేట్లో స్వాతంత్య్ర సమరయోధుల్లో ఒకరైన ఉయ్యాలవాడ నరసింహారెడ్డి 179వ వర్ధంతి కార్యక్రమ సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలవేసి నివాళులు అర్పించారు.
SKLM: ఎచ్చెర్ల మండలం బొంతల కోడూరు ప్రభుత్వ హైస్కూల్లో పదో తరగతి విద్యార్థుల కోసం అమలు చేస్తున్న “వంద రోజులు ప్రణాళిక-భవిష్యత్ కార్యక్రమాన్ని ఎమ్మెల్యే ఈశ్వరరావు ఆదివారం పరిశీలించారు. రాష్ట్ర విద్యాశాఖ మంత్రి లోకేష్ నాయకత్వంలో అమలవుతున్న ఈ కార్యక్రమం విద్యార్థుల ఫలితాలను మెరుగుపర్చేందుకు దోహదపడుతుందని ఆయన పేర్కొన్నారు.
సత్యసాయి: రొద్దం మండలం రాచూరు గ్రామంలో బీటీ రోడ్డు నిర్మాణ పనులకు ఆదివారం భూమి పూజ కార్యక్రమం నిర్వహించారు. రొద్దం మండల టీడీపీ కన్వీనర్ నరహరి మాట్లాడుతూ.. మంత్రి సవిత ఆదేశాల మేరకు రాచూరు బస్టాండ్ నుంచి జక్కలచెరువు గ్రామం వరకు రూ.1 కోటి నిధులతో బీటీ రోడ్ నిర్మాణం చేపట్టనున్నారు. ఈ రహదారి నిర్మాణంతో గ్రామాల మధ్య రాకపోకలు సులభతరం అవుతాయని తెలిపారు.
KDP: స్వాతంత్య్ర సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి దేశం కోసం తన ప్రాణాలను త్యాగం చేశారని, ఆయన యువతకు స్ఫూర్తి అని పలువురు నాయకులు పేర్కొన్నారు. ఉయ్యాలవాడ నరసింహారెడ్డి వర్ధంతి సందర్భంగా రేనాటి సూర్యచంద్రుల సేవా సంఘం ఆధ్వర్యంలో ఆదివారం ప్రొద్దుటూరులోని ఆయన విగ్రహానికి పూలమాలవేసి ఘనంగా నివాళులర్పించారు.
W.G: పాలకొల్లు శంభునిపేటలో ప్రాతః కాలంలో కొన్ని క్షణాలపాటు దృగ్విషంగా కనువిందు చేసిన ‘ఎర్రని సూరీడ్ని’ ఒకటో తరగతి చదువుతున్న వడ్డి గౌరీ శంకర్ అనే బుడతడు సెల్ ఫోన్లో బందించాడు. ఆదివారం తల్లి శైలజతో కలిసి వాకింగ్ చేస్తుండగా తల్లి చేతిలోని సెల్ఫోన్ తీసుకుని క్లిక్ మనిపించాడు. ఈ ఫోటోని వీక్షించిన వారందరూ గౌరీ శంకర్ ఫోటోగ్రఫీ ప్రతిభను ఔరా అంటూ మెచుకుంటున్నారు.
ATP: గుంతకల్లోని రెడ్డి సంక్షేమ సంఘం కార్యాలయంలో ఆదివారం తొలి స్వాతంత్ర సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి 179వ వర్ధంతి వేడుకలు ఘనంగా జరిగాయి. సంఘ అధ్యక్షులు శ్రీధర్ రెడ్డి, కార్యవర్గ సభ్యులు ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన ప్రాణత్యాగాన్ని స్మరించుకున్నారు. ఈ కార్యక్రమంలో సంఘ సభ్యులు, రెడ్డి సోదరులు పాల్గొన్నారు.
E.G: వైసీపీ ఎమ్మెల్సీలను బర్తరఫ్ చేయాలని రాష్ట్ర అంచనాల కమిటీ ఛైర్మన్, ఎమ్మెల్యే వేగుళ్ల జోగేశ్వరరావు పేర్కొన్నారు. మండపేట టీడీపీ కార్యాలయంలో ఆదివారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. సభ గౌరవాన్ని కాలరాసారనీ విమర్శించారు. కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని అగౌరవపర్చారనీ పేర్కొన్నారు. ఈ అపచారానికి జగన్ లెంపలు వేసుకోవాలన్నారు.
NLR: అల్లూరు గ్రామంలో వేంచేసియున్న శ్రీ పోలేరమ్మ తల్లిని ఆదివారం కావలి ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. నియోజకవర్గ ప్రజల ఆయురారోగ్యాలు, సుఖశాంతుల కోసం అమ్మవారిని ప్రార్థించారు. గ్రామదేవతల ఆశీస్సులతో సమాజం సుభిక్షంగా అభివృద్ధి చెందుతుందని ఎమ్మెల్యే పేర్కొన్నారు. ఆలయ అభివృద్ధికి అవసరమైన సహకారం అందిస్తామని హామీ ఇచ్చారు.
అనకాపల్లి కలెక్టరేట్తో పాటు జిల్లాలో మున్సిపల్, డివిజన్, మండల స్థాయిలో పీజీఆర్ఎస్, రెవిన్యూ క్లినిక్ కార్యక్రమాలను ఈనెల 23వ తేదీన నిర్వహించనున్నట్లు కలెక్టర్ విజయ కృష్ణన్ ఓ ప్రకటనలో పేర్కొన్నారు. ఉదయం 10 గంటలకు కార్యక్రమం ప్రారంభం అవుతుందన్నారు. స్వయంగా రాలేని వారు meekosam.ap.gov.in వెబ్ సైట్ ద్వారా తమ అర్జీలను పంపించాలని సూచించారు.