మూడున్నరేళ్ల వైసీపీ పాలనలో రాష్ట్రంలోని అన్ని వర్గాల ప్రజలు తీవ్రంగా నష్టపోయారని తెలుగుదేశం పార్టీ పొలిట్ బ్యూరో సభ్యుడు, శాసన మండలి ప్రతిపక్ష నేత యనమల రామకృష్ణుడు ఆరోపించారు. రాష్ట్రంలోని యువతను ముఖ్యమంత్రి జగన్ మోసం చేశారని విమర్శించారు. ఏటా జనవరిలో నోటిఫికేషన్ విడుదల చేసి లక్షలాదిగా ప్రభుత్వ ఉద్యోగాలు ఇస్తామంటూ యువతకు జగన్ రెడ్డి హామీ ఇచ్చారని, అధికారంలోకి వచ్చిన తర్వాత నోటిఫికేషన్ల మాటే మరి...
తమ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నిశ్శబ్దంగా తన పని తాను చేసుకుంటూ వెళ్తున్నాడని ఆంధ్రప్రదేశ్ మంత్రి ఆర్కే రోజా తెలిపారు. ప్రజల కష్టాల్ని తెలుసుకుంటూ వారి జీవితాల్లో సంతోషాన్ని నింపుతూ సీఎం జగన్ అందరి ఆశీర్వాదం పొందుతున్నారని తెలిపారు. ఈ సందర్భంగా మంత్రి రోజా సీఎం జగన్ ప్రశంసలు కురిపించారు. వేమన పద్యాల్లాంటి స్వచ్ఛమైన మనసు తమ ముఖ్యమంత్రి జగన్ ది అని పేర్కొన్నారు. శ్రీ సత్య సాయి జిల్లా కదిర...
సలహాదారుల వ్యవహారంపై ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో గురువారం విచారణ జరిగింది. దేవాదాయశాఖ సలహాదారుడు శ్రీకాంత్ నియామకం, ఉద్యోగుల సలహాదారుడు చంద్రశేఖర్ రెడ్డి నియామకంపై విచారించిన హైకోర్టు ఈ సందర్భంగా తీవ్ర వ్యాఖ్యలు చేసింది. ఏవైనా రాజకీయాలుంటే బయటే చూసుకోవాలని పేర్కొంది. రాజకీయాలను కోర్టు వరకూ తీసుకురావద్దని సూచించింది. రాజకీయాలు తీసుకొస్తే ఎలా హ్యాండిల్ చేయాలో మాకు తెలుసని ధర్మాసనం ఘాటుగా స్పందించింది...
తిరుమల శ్రీవారి దర్శనానికి భక్తులు నలుమూలల నుంచి తరలి వస్తుంటారు. తాజాగా నేడు కూడా తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. గురువారం వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లోని 17 కంపార్టుమెంట్లలో భక్తులు శ్రీవారి దర్శనం కోసం ఎదురుచూస్తున్నారు. శ్రీవారి దర్శనానికి 12 గంటల సమయం పడుతుందని ఆలయ అధికారులు తెలిపారు. సర్వ దర్శనం క్యూ లైన్లలో వేచి ఉన్నవారికి 21 గంటలు పడుతుందని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు వెల్లడించ...
వచ్చే ఎన్నికల్లో తమ పార్టీ కచ్చితంగా విజయం సాధిస్తుందని.. టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి అయ్యన్న పాత్రుడు ధీమా వ్యక్తం చేశారు. ప్రస్తుతం అధికారంలో ఉన్న వైసీపీపై ఆయన విమర్శల వర్షం కురిపించారు. రాష్ట్రంలో రాక్షస, సైకో పాలన సాగుతోందని మండిపడ్డారు. సైకో పాలన పోవాలంటే.. సైకిల్ రావాలన్నారు. వైసీపీ గెలిచిన ఏడాదిలో మద్యం షాపులు మూసివేస్తామన్నారు. కానీ మద్యంపాలసీ పైనే ఆధారపడి ప్రభుత్వాన్ని నడుపుతున్నా...
ఏపీ ఉద్యోగ సంఘం నేతలు గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్ను కలిశారు. వేతనాలు లేక ఇబ్బందులు పడుతున్నామని వినతి పత్రం ఇచ్చారు. అనంతరం వారు మీడియాతో మాట్లాడారు. ప్రభుత్వ ఉద్యోగులు అందరు నిస్సహాయక స్థితిలో ఉన్నారన్నారు. ఉద్యోగుల ఆర్థిక ప్రయోజనాలను ప్రభుత్వం సకాలంలో చెల్లించడం లేదన్నారు. ప్రతి నెల 1వ తేదీన వేతనాలు ఇవ్వాల్సి ఉందని చెప్పారు. కానీ ప్రభుత్వం పట్టించుకోవడం లేదని ఆరోపించారు. ఉద్యోగుల అనుమతి లేకు...
ఇలాంటి ముఖ్యమంత్రిని తన రాజకీయ జీవితంలో చూడలేదన్నారు మంత్రి పెద్దిరెడ్డి. మంగళగిరిలో రాష్ట్ర అటవీ శాఖ కార్యాలయాన్ని ప్రారంభించారు పెద్దిరెడ్డి రామచంద్రా రెడ్డి. ఈ సందర్భంగా మాట్లాడారు. యాభై ఏళ్ల నుండి తాను రాజకీయాల్లో ఉంటున్నట్లు చెప్పారు. జగన్ వంటి ముఖ్యమంత్రిని మాత్రం చూడలేదన్నారు. 2024లోను మళ్లీ వైసీపీనే గెలుస్తుందని చెప్పారు. జగన్ మరోసారి ముఖ్యమంత్రి కావడం ఖాయమన్నారు. ప్రజాస్వామ్యంలో ఇంత గొ...
తమ పార్టీ సభకు జనాలు పెద్ద ఎత్తున వచ్చారని.. డ్రోన్ షాట్లు, కెమెరాలతో రికార్డు చేసి పబ్లిసిటీ కోసం ఇరుకైన ప్రాంతంలో సభ పెట్టారని చంద్రబాబు మీద అంబటి నాగ రాధాకృష్ణ యాదవ్ ఎన్ హెచ్ఆర్సీకి ఫిర్యాదు చేశారు. ప్రభుత్వం మీద వ్యతిరేకత ఉండటం వల్లే తమ సభకు పెద్ద ఎత్తున జనాలు వచ్చారని ప్రచారం చేసుకునేందుకు బాబు అలా చేశారని ఆయన ఆరోపించారు. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు కందుకూరులో నిర్వహించిన సభ మీద ఆయన [&h...
వైసీపీ రెబల్ ఎంపీ రఘురామ కృష్ణరాజు సంచలన వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే తెలుగుదేశం, జనసేన పార్టీల కూటమి గెలుపొందడం ఖాయమన్నారు. వైసీపీ 175 సీట్లలో గెలుస్తాం అని మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తుందని మండిపడ్డారు. అదీ కలలో కూడా జరిగే అవకాశం లేదన్నారు. వచ్చే ఎన్నికల్లో టీడీపీకి ప్రజల నుంచి ఆదరణ లభించనుందని తెలిపారు. ప్రస్తుత ట్రెండ్ పరిశీలిస్తే వైసీపీకి ఓటమి తప్పేల...
నటి నిత్యామీనన్ విద్యార్థులకు తెలుగు పాఠాలు చెప్పింది. ఇందుకు సంబంధించిన వీడియో తన ఇన్స్టాలో పోస్ట్ చేసింది. ఈ మలయాళీ భామ తెలుగు చక్కగా మాట్లాడుతోందని నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు. ప్రస్తుతం ఆమె ఓ మలయాళీ సినిమాలో నటిస్తోంది. సినిమా షూటింగ్లో భాగంగా ఆంధ్రప్రదేశ్లోని కృష్ణాపూరంలో సందడి చేశారు. షూటింగ్ తర్వాత స్థానిక గవర్నమెంట్ స్కూల్కు వెళ్లారు. కాసేపు చిన్నారులతో సరదాగా గడిపారు. ఇంగ్ల...
తెలంగాణలో సై అంటే సై అంటున్న బీజేపీ, బీఆర్ఎస్ ఓ విషయంలో మాత్రం ఒకే ఆలోచనతో ఉన్నాయట. కలిసి పని చేయనప్పటికీ… అమిత్ షా, కేసీఆర్ల ఆరాటం జగన్ గెలుపు, చంద్రబాబు ఓటమి అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. 2015లో ఓటుకు నోటు కేసు నుండి చంద్రబాబును టార్గెట్ చేస్తూ వస్తున్నారు కేసీఆర్. అలాగే, 2019 ఎన్నికలకు ఆరు నెలల ముందు తన రాజకీయ మనుగడ కోసం ఏపీలో తమను బద్నాం చేసేందుకు అస్త్రశస్త్రాలు ఉపయోగించిన టీడీపీ అ...
కమ్యూనిస్ట్లు చారిత్రక తప్పిదాలు చేస్తుంటారు.. అలా ఎందుకంటారో మరోసారి నిరూపితమైందని అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. ఖమ్మం బీఆర్ఎస్ ఆవిర్భావ సభలో కేసీఆర్తో పాటు కేజ్రీవాల్, భగవంత్ మాన్, పినరాయి విజయన్, అఖిలేష్ యాదవ్, డీ రాజా, తమ్మినేని వీరభద్రం తదితరులు పాల్గొన్నారు. సాధారణంగా ఆవిర్భావ సభలో ఎవరైనా తాము ఏం చేయదల్చుకున్నామో చెబుతారు.. కానీ ఈ సభలోని ప్రముఖులంతా కేవలం మోడీని, బీజేపీని మాత్రమే టార్గ...
ఏపీ సీఎం జగన్పై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. అబద్ధానికి ప్యాంట్ షర్ట్ వేస్తే జగన్ రెడ్డిలా ఉంటుందని ఆరోపించారు. ఆయన నోరు తెరిస్తే అబద్ధాలు అని, అందుకే అబద్ధాల రెడ్డి అని పేరు పెట్టానన్నారు. మద్యపాన నిషేధం అబద్ధం, రూ.3 వేల పెన్షన్ అబద్ధం, జాబ్ క్యాలెండర్ అబద్ధం, ప్రత్యేక హోదా అబద్ధం, జగన్ చెప్పేవన్నీ అబద్ధాలేనని నారా లోకేశ్ స్పష్టం చేశార...
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి రూ.500 నోట్లు, రూ.2000 నోట్లను దాచిపెడుతున్నారని సంచలన ఆరోపణలు చేశారు టీడీపీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు. టీడీపీ వ్యవస్థాపకులు ఎన్టీఆర్ 27వ వర్ధంతి సందర్భంగా మంగళగిరిలోని పార్టీ కార్యాలయంలో నివాళులు అర్పించిన అనంతరం మాట్లాడారు. ఇటీవల 500, 2000 నోట్ల రూపాయలు కనిపించడం లేదని, అన్నీ జగన్ ఇంటికి వెళ్లిపోయాయన్నారు. ఆ నోట్లను ఎక్కడికెక్కడికో పంపించ...
కేంద్రంలో తాము అధికారంలోకి రాగానే సైన్యానికి సంబంధించి అగ్నిపథ్ పథకాన్ని రద్దు చేస్తామని భారత రాష్ట్ర సమితి అధినేత, తెలంగాణ సీఎం కల్వకుంట్ల చంద్రశేఖరరావు బుధవారం స్పష్టం చేశారు. తాము పాత పద్ధతిలోనే దానిని కొనసాగిస్తామని హామీ ఇచ్చారు. సైన్యానికి ఒక పద్ధతి అంటూ ఉండాలన్నారు. ఖమ్మం బీఆర్ఎస్ ఆవిర్భావ బహిరంగ సభలో మాట్లాడారు. బీజేపీ మతవిద్వేషాలు రెచ్చగొడుతూ పబ్బం గడుపుకునే ప్రయత్నం చేస్తోందని, వాటిని ...