ఆయనపై నెల్లూరు అవినీతి ఆరోపణలు చాలా ఉన్నాయి. ఈసారి నెల్లూరు ఎమ్మెల్యే (MLA)గా పోటీ చేయాలని ద్వారకనాథ్ భావిస్తున్నాడు. టికెట్ కోసం పార్టీ ప్రసన్నం చేసుకునేందుకు ప్రత్యేక కార్యక్రమాలు చేస్తున్నాడు.
ప్రముఖ నటుడు పోసాని కృష్ణమురళి(Posani Krishnamurali) ఎన్టీఆర్పై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం ఏపీ ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్గా బాధ్యతలు నిర్వర్తిస్తోన్న పోసాని ఇటీవల ఓ ఛానెల్ ఇంటర్వ్యూకు హాజరయ్యారు. ఈ సందర్భంగా తారక్ పొలిటికల్ ఎంట్రీపై ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు.‘సీనియర్ ఎన్టీఆర్ అనారోగ్యంతో ఉన్న పరిస్థితుల్లో ఆమె భార్య చనిపోయింది. ఆ సమయంలోనే ఎన్టీఆర్కు అండగా ఉం...
వైసీపీ(Ycp)కి షాక్ తగిలింది. తూర్పుగోదావరి జిల్లాలో వైసీపీకి చెందిన మాజీ ఎమ్మెల్యే టీవీ రామారావు(TV Rama Rao) పార్టీకి రాజీనామా చేశారు. త్వరలో ఆయన ఏ పార్టీలో చేరనున్నారో చెబుతానన్నారు. తన అనుచరులతో కలిసి చర్చించిన తర్వాత తుది నిర్ణయం తీసుకుంటానన్నారు. 2009 ఎన్నికల్లో టీవీ రామారావు(TV Rama Rao) కొవ్వూరు నియోజకవర్గం నుంచి టీడీపీ(TDP) తరపున పోటీ చేశారు. ఆ ఎన్నికల్లో విజయం సాధించారు.
ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh)లో కానిస్టేబుల్ ఫిజికల్ ఈవెంట్లు వాయిదా(Postponement) పడ్డాయి. మార్చి 13న ఎమ్మెల్సీ ఎన్నికలు జరగనున్నాయి. మార్చి 14 నుంచి అసెంబ్లీ సమావేశాలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో, పోలీసు కానిస్టేబుల్ పీఎంటీ/పీఈటీ ఫిజికల్ ఈవెంట్లు వాయిదా వేస్తున్నట్టు పోలీస్ రిక్రూట్ మెంట్ కౌన్సిల్ వెల్లడించింది. ఈ అసౌకర్యానికి చింతిస్తున్నామని, త్వరలోనే కొత్త తేదీలు ప్రకటిస్తామని వారు తెలిపారు.
Hot summer:మార్చి వచ్చింది.. కొన్ని చోట్ల వాతావరణం కాస్త చల్లగా ఉన్నా.. మరికొన్ని చోట్ల మాత్రం ఎండ వేడిమి ఉంది. ఉదయం 10 దాటితే చాలు భానుడి భగ భగలు కొనసాగుతున్నాయి. దైవభూమి కేరళలో రికార్డు స్థాయిలో 54 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. మిగతా చోట్ల కూడా ఎండ ప్రభావం ఉంది.
Avinash reddy:మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో వైసీపీ ఎంపీ అవినాష్ రెడ్డికి కాస్త ఊరట కలిగింది. ఈ కేసులో ఇప్పటికే ఆయనను పలుమార్లు సీబీఐ విచారించింది. అయితే ఈ రోజు కూడా విచారించాల్సి ఉంది. ఇంతలో సీబీఐ అధికారుల తీరు గురించి అవినాష్ రెడ్డి హైకోర్టులో పిటిషన్ వేశారు. దానికి సంబంధించి సోమవారం వరకు ఆయనను అరెస్ట్ చేయొద్దని సీబీఐ అధికారులకు తెలంగాణ హైకోర్టు ఆదేశాలు జారీచేసింది.
పార్లమెంటులో బీసీ(BC) బిల్లు(Bill) ప్రవేశపెట్టాలని జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు, రాజ్యసభ సభ్యుడు ఆర్.కృష్ణయ్య(R Krishnaiah) డిమాండ్ చేశారు. ఆయా రాష్ట్రాల్లోని చట్టసభల్లో బీసీలకు 56 శాతం రిజర్వేషన్లు(reservations) కల్పించాలని కోరారు. బీసీ(BC)లకు చట్టసభల్లో రిజర్వేషన్ల బిల్లు అంశంపై ఏప్రిల్ 3న ఢిల్లీ(delhi)లో ధర్నా చేయనున్నట్లు చెప్పారు.
వైయస్ వివేకానంద (YS Vivekananda Reddy) కూతురు సునీత (Suneetha Narreddy) కూడా తెలంగాణ హైకోర్టు మెట్లు ఎక్కారు. అవినాష్ పిటిషన్ పైన విచారణలో తనను ఇంప్లీడ్ చేయాలని (implied petition) ఆమె కోరుతున్నారు.
గతంలో కూడా ఇలాంటి చర్యలతో మార్గాని భరత్ ట్రోలింగ్ కు గురయ్యాడు. తాజా సినిమా వ్యాఖ్యలతో మరింత ట్రోలింగ్ బారిన పడ్డాడు. ఈ సంఘటనతో మీమర్స్ కు మరో అవకాశం దొరికింది. కాగా భరత్ వ్యాఖ్యలపై ప్రతిపక్షాలు దుమ్మెత్తిపోస్తున్నాయి. రాకీయాలను వదిలి సినిమాల్లోకి వెళ్లాలని చెప్పాడు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో (Andhra Pradesh) ప్రస్తుతం అన్నీ సాధారణ వైరల్ జ్వరాలు కనిపిస్తున్నాయని ఆ రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ గురువారం ప్రకటించింది. తిరుపతి స్విమ్స్ (tirupati svims hospital)లోని వీఆర్డీఎల్ ల్యాబ్ లో దాదాపు 750 నమూనాలను పరిశీలించగా, జనవరి నెలలో 12, ఫిబ్రవరిలో 9 చొప్పున H3N2 కేసులు కనిపించాయన్నారు.
Lokesh Padayatra : యువగళం పేరిట లోకేష్ చేపట్టిన పాదయాత్ర 500 కిలోమీటర్లు పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా మదనపల్లి సీటీఎం దగ్గర నారా లోకేష్ శిలాఫలకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా నారా లోకేష్ మాట్లాడుతూ దేశంలోనే మొదటి మైనార్టీ కార్పొరేషన్ ఏర్పాటు చేసింది టీడీపీ అని పేర్కొన్న ఆయన జగన్ ప్రభుత్వం వచ్చి మైనార్టీ కార్పొరేషన్ ను నిర్వీర్యం చేసిందన్నారు.
Dear gvmc:సాగర తీరాన చెత్త (garbage), చెదారం ఎక్కువే ఉంటుంది. పర్యాటకుల (tourist) రాకను బట్టి గార్బెజ్ కనిపిస్తుంది. అయితే క్లీన్ (clean) చేయడం పెద్ద పని.. అవును కార్మికులతో (labourer) పని చేయించాలి. దాదాపు అన్ని చోట్ల క్లీన్ (clean) చేస్తుంటారు. కానీ విశాఖకు (vizag) చెందిన ఓ నెటిజన్ (netizen) మాత్రం చక్కని ఐడియా (idea) ఇచ్చాడు.
telangana high court:వైఎస్ వివేకా (ys viveka) హత్య కేసులో విచారణకు సంబంధించి వైసీపీ ఎంపీ అవినాష్ రెడ్డి తెలంగాణ హైకోర్టును ఆశ్రయించారు. సీబీఐ విచారణను ఆడియో, వీడియో రికార్డింగ్ చేసేలా ఆదేశాలు ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. అలాగే విచారణ లాయర్ సమక్షంలో జరిగేలా చూడాలని కోరారు.
కర్నూలు(Kurnool)లో దారుణం జరిగింది. జాతరకి వచ్చిన అల్లుడి (Son-in-law) సొంత మామే అత్యంత క్రూరంగా హతమార్చాడు (killed). జాతరలో అందరి ముందే అతి కిరతంగా కత్తి తో( knife) నరికి చంపేశాడు. దేవనకొండ మండలం పి. కోటకొండ గ్రామానికి చెందిన లింగయ్య కుమార్తెను సూర్యప్రకాశ్(23) అనే యువకుడు వివాహం చేసుకున్నాడు.