• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »ఆంధ్రప్రదేశ్

నేడు జిల్లాకు రానున్న డిప్యూటీ సీఎం

VSP: డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ నేడు విశాఖ రానున్నారు. ఇవాళ మధ్యాహ్నం 2.30 గంటలకు విశాఖ ఎయిర్‌పోర్టుకు చేరుకుని అక్కడి నుంచి నక్కపల్లి మండలం చందనాడ గ్రామానికి వెళ్తారు. చందనాడలో జరిగే స్టీల్ ప్లాంట్ శంకుస్థాపన కార్యక్రమంలో సీఎం చంద్రబాబుతో కలిసి ఆయన పాల్గొంటారు. సాయంత్రం 6 గంటలకు విశాఖ నుంచి విజయవాడ బయలుదేరి వెళ్తారు.

March 23, 2026 / 07:14 AM IST

ప్రమాదాల నివారణకు ‘రేడియం’రక్షణ

ELR: తడికలపూడి పోలీస్ స్టేషన్ పరిధిలోని ప్రమాదకర మలుపుల వద్ద రేడియం స్టిక్కర్లతో కూడిన డబ్బాలను ఏర్పాటు చేసినట్లు ఎస్సై చెన్నారావు తెలిపారు. రాత్రి వేళల్లో ఈ స్టిక్కర్లు మెరుస్తూ.. వాహనదారులను అప్రమత్తం చేస్తాయని, దీనివల్ల ప్రమాదాలు తగ్గుతాయని ఆయన పేర్కొన్నారు. ప్రయాణికులు రవాణా నిబంధనలు పాటిస్తూ.. అప్రమత్తంగా వాహనాలు నడపాలని ఈ సందర్భంగా ఆయన సూచించారు.

March 23, 2026 / 07:13 AM IST

నేడు కలక్టరేట్లో PGRS , రెవెన్యూ క్లినిక్

VZM: కలెక్టరేట్‌లో ఇవాళ ప్రజల సమస్యల పరిష్కారం కోసం PGRS కార్యక్రమం నిర్వహించనున్నట్లు కలెక్టర్ రాంసుందర్ రెడ్డి నిన్న తెలిపారు. అధికారులు ప్రజల నుంచి నేరుగా అర్జీలు స్వీకరిస్తారని, భూ సమస్యల కోసం ప్రత్యేకంగా రెవెన్యూ క్లినిక్ కూడా నిర్వహిస్తున్నామన్నారు. కలెక్టరేట్‌కు రాలేని వారు 1100 టోల్ ఫ్రీ నెంబర్, ఆన్ లైన్ ద్వారా ఫిర్యాదు చేయవచ్చని పేర్కొన్నారు.

March 23, 2026 / 07:12 AM IST

నేడు డయల్ యువర్ ఎస్ఈ కార్యక్రమం

నెల్లూరులో సోమవారం ఉదయం 8.30 నుంచి 9.30 గంటల వరకు డయల్ యువర్ ఎస్ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు విద్యుత్ శాఖ సూపరింటెండెంట్ ఇంజినీర్ కె.రాఘవేంద్రం తెలిపారు. 0861 2320427 నంబర్‌కు ఫోన్ చేసి సమస్యలు తెలిపితే పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని వివరించారు. ప్రజలు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని ఆయన కోరారు.

March 23, 2026 / 07:09 AM IST

గడ్డి మందు తాగిన వ్యక్తి మృతి

AKP: కశింకోట గవరపేటలో మద్యం మత్తులో గడ్డి మందు తాగి విశాఖ కేజీహెచ్‌లో చికిత్స పొందుతున్న రైతు బీసెట్టి సీతారాం (65) ఆదివారం మృతి చెందినట్లు ఎస్సై మనోజ్ కుమార్ తెలిపారు. ఈనెల 20వ తేదీన ఇంటి వద్ద గడ్డి మందు తాగి అపస్మారక స్థితికి చేరుకోవడంతో కుటుంబ సభ్యులు వెంటనే అనకాపల్లి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అక్కడ ప్రథమ చికిత్స చేసి విశాఖ కేజీహెచ్‌కు పంపించారు.

March 23, 2026 / 07:04 AM IST

గడ్డి ముందు తాగిన వ్యక్తి మృతి

AKP: కశింకోట గవరపేటలో మద్యం మత్తులో గడ్డి మందు తాగి విశాఖ కేజీహెచ్‌లో చికిత్స పొందుతున్న రైతు బీసెట్టి సీతారాం (65) ఆదివారం మృతి చెందినట్లు ఎస్సై మనోజ్ కుమార్ తెలిపారు. ఈనెల 20వ తేదీన ఇంటి వద్ద గడ్డి మందు తాగి అపస్మారక స్థితికి చేరుకోవడంతో కుటుంబ సభ్యులు వెంటనే అనకాపల్లి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అక్కడ ప్రథమ చికిత్స చేసి విశాఖ కేజీహెచ్‌కు పంపించారు.

March 23, 2026 / 07:04 AM IST

బర్రెలకు తప్పిన ప్రమాదం

TPT: కోట హరిజనవాడలో ఆదివారం అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. చెన్నకేశ్వర స్వామి గుడి ఎదురుగా ఉన్న బర్రెల దొడ్డి పక్కన పిల్లలు టపాకాయలు పేల్చడంతో నిప్పురవ్వలు గడ్డివాముపై పడి మంటలు చెలరేగాయి. ఎండాకాలం కారణంగా మంటలు వేగంగా వ్యాపించాయి. స్థానికులు అప్రమత్తమై వెంటనే బర్రెలను బయటకు తీసి రక్షించారు.పెద్ద ప్రమాదం తప్పడంతో స్థానికులు ఊపిరి పీల్చుకున్నారు.

March 23, 2026 / 07:04 AM IST

గోట్లూరులో పరుగు పందెం పోటీలు

శ్రీరామనవమి పురస్కరించుకుని శ్రీ సత్యసాయి జిల్లా ధర్మవరం మండలం గోట్లూరులో ఈనెల 27న పరుగు పందెం నిర్వహిస్తున్నారు. ఉమ్మడి అనంతపురం, సత్యసాయి జిల్లాల క్రీడాకారులు ఇందులో పాల్గొనవచ్చు. 2 కిలోమీటర్ల ఈ పోటీలో విజేతలకు రూ. 5016వేల నుంచి రూ.1016 వేల వరకు నగదు బహుమతులు అందజేస్తారు. ఆసక్తి గల వారు ముందే పేర్లు నమోదు చేసుకోవాలని నిర్వాహకులు కోరారు.

March 23, 2026 / 07:00 AM IST

‘భోజన పథకంపై అనుచిత వ్యాఖ్యలు చేయడం తగదు’

AKP: ప్రవచనకర్త గరికపాటి నరసింహారావు డొక్కా సీతమ్మ భోజన పథకంపై అనుచిత వ్యాఖ్యలు చేయడం తగదని విదసం ఐక్యవేదిక రాష్ట్ర కన్వీనర్ బూసి వెంకట్రావు అన్నారు. ఆదివారం అనకాపల్లి విదసం కార్యాలయంలో మాట్లాడుతూ.. ప్రభుత్వం ఆయనకు ఇచ్చిన పద్మశ్రీ అవార్డును వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. 2013 ఆహార భద్రతలో భాగంగా అమలు చేస్తున్న భోజన పథకాన్ని అపహాస్యం చేశారన్నారు.

March 23, 2026 / 06:53 AM IST

జల్లికట్టు ఉత్సవాల్లో విషాదం

CTR: వెదురుకుప్పం మండలం పాత గుంట గ్రామంలో జోరుగా సాగిన జల్లికట్టులో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. జల్లికట్టు ఉత్సవాల్లో పాల్గొనడానికి వచ్చిన కోడెద్దులు పగలంతా కాసిన ఎండకు అలసిపోయాయి. ముగింపు సమయంలో గంతులేసుకుంటూ సమీపంలోని మారేపల్లి చెరువులో తాగునీటికి వెళ్లి మూడు ఎద్దులు దుర్మరణం చెందాయి. ఈ ఘటన యజమానులను తీవ్ర విషాదంలోకి నెట్టివేసింది.

March 23, 2026 / 06:51 AM IST

నేడు ఒంటిమిట్టకు టీటీడీ జెఈవో రాక..!

KDP: ఒంటిమిట్ట కోదండ రామాలయంలో ఈనెల 26 నుంచి ప్రారంభం కానున్న శ్రీరామనవమి వార్షిక బ్రహ్మోత్సవాల ఏర్పాట్ల పరిశీలన కోసం తితిదే జేఈవో వల్లూరు వీరబ్రహ్మం సోమవారం ఇక్కడికి రానున్నారు. రామయ్య క్షేత్రం, మాడ వీధులు, కాలిబాటలు, విశ్రాంతి భవనం, కల్యాణ వేదిక ప్రాంగణంలో జరుగుతున్న పనులను ఆయా విభాగాల అధికారులతో కలిసి పరిశీలించి అనంతరం సమీక్ష నిర్వహించనున్నారు.

March 23, 2026 / 06:51 AM IST

పెనుగొండలో ఎస్సై హెచ్చరిక..!

WG: ట్రాఫిక్ నిబంధనలు పాటించడం మన అందరి బాధ్యత, వాటిని ఉల్లంఘిస్తే చర్యలు తప్పవని పెనుగొండ ఎస్సై గంగాధరరావు ప్రయాణికులను హెచ్చరించారు. ఆదివారం సాయంత్రం ట్రాఫిక్ నిబంధనలు పాటించని వాహనదారులకు చలాన్లు విధించి కౌన్సిలింగ్ ఇచ్చారు. ప్రతి ఒక్కరూ ద్విచక్ర వాహనంపై ప్రయాణించేటప్పుడు హెల్మెట్ తప్పనిసరిగా ధరించాలని అది ప్రమాదంలో రక్షిస్తుందని అన్నారు.

March 23, 2026 / 06:45 AM IST

డిప్యూటీ సీఎం టూర్ షెడ్యూల్

AKP: డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ విశాఖ ఎయిర్‌పోర్ట్ నుంచి హెలికాప్టర్‌లో బయలుదేరి మధ్యాహ్నం ‌2.55 గంటలకు నక్కపల్లి మండలం చందనాడ చేరుకుంటారు. 5:30 గంటలకు సీఎం చంద్రబాబుతో కలిసి స్టీల్ ప్లాంట్‌కు శంకుస్థాపన చేస్తారు. అనంతరం బహిరంగ సభలో పాల్గొంటారు. తిరిగి సాయంత్రం 5:45 గంటలకు హెలికాప్టర్‌లో బయలుదేరి విశాఖ వెళతారు.

March 23, 2026 / 06:45 AM IST

పట్టుపరిశ్రమ ఉద్యోగుల సంఘం ఎన్నికల షెడ్యూల్ విడుదల

ATP: జిల్లా పట్టుపరిశ్రమ ఉద్యోగుల పరపతి సంఘం ఎన్నికలు ఏప్రిల్ 11న నిర్వహించనున్నట్లు కలెక్టర్ ఆనంద్ ఉత్తర్వులు జారీ చేశారు. మొత్తం ఏడు డైరెక్టర్ల స్థానాలకు 237 మంది ఓటర్లు ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. ఏప్రిల్ 6న నామినేషన్ల స్వీకరణ, 7న పరిశీలన, 8న ఉపసంహరణ ప్రక్రియ ఉంటుందని పేర్కొన్నారు. ఏప్రిల్ 2న తుది జాబితా ప్రచురిస్తామని తెలిపారు.

March 23, 2026 / 06:40 AM IST

నేడు పాండురంగ స్వామి ఆలయంకు రానున్న ఎమ్మెల్యే

TPT: సూళ్లూరుపేటలోని శ్రీ రుక్మిణి సమేత శ్రీ పాండురంగ స్వామి దేవస్థానంలో నేడు పుష్కర కుంభాభిషేకం నిర్వహించనున్నారు. ఉదయం 9 గంటలకు ప్రారంభమయ్యే ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే నెలవల విజయశ్రీ హాజరుకానున్నారు. భక్తి శ్రద్ధల మధ్య జరిగే ఈ వేడుకకు స్థానిక ప్రజలు, నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొనాలని నిర్వాహకులు కోరుతున్నారు.

March 23, 2026 / 06:39 AM IST