GNTR: గుంటూరు పశ్చిమ నియోజకవర్గం 25వ డివిజన్లో నాలుగు ప్రాంతాల్లో రూ.1.3 కోట్ల వ్యయంతో మౌలిక సదుపాయాల అభివృద్ధి పనులకు ఎమ్మెల్యే గళ్ళా మాధవి శంకుస్థాపన చేశారు. ప్రజల ప్రాథమిక అవసరాల పరిష్కారమే తమ లక్ష్యమని తెలిపారు. ప్రతి కాలనీలో మౌలిక సదుపాయాలను మెరుగుపరచడానికి కట్టుబడి ఉన్నామని చెప్పారు.