VSP: జీవీఎంసీ ఆస్తుల నిర్వహణను ప్రైవేటు సంస్థలకు అప్పగించే టెండర్పై జనసేన మాజీ కార్పొరేటర్ పీతల మూర్తి యాదవ్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. స్మార్ట్ సిటీ కార్పొరేషన్ ద్వారా టెండర్లు పిలవడం నిబంధనలకు విరుద్ధమని, ఇందులో అవకతవకలు ఉన్నాయని ఆరోపించారు. టెండర్ను వెంటనే రద్దు చేసి, స్మార్ట్ సిటీ పనులపై శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు.