KDP: కాశినాయన మండలం ఇటుకులపాడులో భూ వివాదం ఉద్రిక్తంగా మారింది. గంజికుంట సుబ్బరాజేశ్వరరావు మాట్లాడుతూ.. సర్వే నంబర్ 458లో తాము చట్టబద్ధంగా కొనుగోలు చేసిన 18.40 సెంట్ల భూమిని కొందరు వ్యక్తులు ఆక్రమించేందుకు దౌర్జన్యం చేస్తున్నారని ఆరోపించారు. తమ వద్ద అన్ని డాక్యుమెంట్లు ఉండగా కోర్టు నుంచి ఇంటిరిమ్ ఇంజక్షన్ ఆర్డర్ కూడా పొందామని తెలిపారు.