ప్రకాశం: భగత్ సింగ్ 117వ జయంతి సందర్భంగా కనిగిరి SFI, DYFI ఆధ్వర్యంలో ఆదివారం రక్తదాన శిబిరం నిర్వహించారు. ఈ మేరకు రక్తదాన శిబిరాన్ని గుత్తి శ్రీధర్ ప్రారంభించారు. శ్రీధర్ మాట్లాడుతూ.. యువత రక్తదాన శిబిరాలు ఏర్పాటు చేయడం అభినందనీయమని, ఇలాంటి కార్యక్రమాలు భవిష్యత్తులో కూడా చేయాలని SFI, DYSF నాయకులను కోరారు. కాగా, 30మంది యువకులు రక్తదానం చేశారు.