NDL: బనగానపల్లె మండలంలోని యాగంటి పల్లె గ్రామంలో రోడ్ల భవనాల శాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి పర్యటిస్తున్నారు. ఏపీ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన రెవెన్యూ సదస్సులో ముఖ్యఅతిథిగా మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి పాల్గొంటారు. గ్రామ ప్రజలు రైతులు పాల్గొని విజయవంతం చేయాలని రెవెన్యూ అధికారులు తెలిపారు.