నంద్యాల జిల్లా బేతంచెర్లలో సీపీఐ ఆధ్వర్యంలో మంగళవారం తహసీల్దార్ కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించారు. గ్రామాల్లో 3 సెంట్లు, పట్టణాల్లో 2 సెంట్లు ఇళ్ల స్థలాలు ఇవ్వాలని, ఇంటి నిర్మాణానికి రూ.5 లక్షలు మంజూరు చేయాలని సీపీఐ మండల ప్రధాన కార్యదర్శి భార్గవ్ డిమాండ్ చేశారు. అనంతరం తహసీల్దార్ నాగమణికి వినతి పత్రం సమర్పించారు.