CTR: చిత్తూరు జిల్లా కేంద్రంలోని స్థానిక పోలీసు కార్యాలయంలో సోమవారం PGRS కార్యక్రమం జరుగుతుందని ఎస్పీ తుషార్ డూడి ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. సోమవారం ఉదయం 10: 30 నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు ప్రజల నుంచి వినతి పత్రాలను స్వీకరిస్తామని తెలిపారు. పోలీసు శాఖ నుంచి సమస్యలు ఎదుర్కొంటున్న వారు నేరుగా ఫిర్యాదు చెయ్యాలని కోరారు.