BPT: చీరాల మండలంలోని సీతానగరం రైల్వే గేట్ నాలుగు రోజులు మూసివేస్తున్నట్టు రైల్వే అధికారులు తెలిపారు. ట్రాక్ మధ్య గల ప్లాట్ ఫామ్ మరమ్మతు పనుల కారణంగా శనివారం గేటు మూసివేశారు. ఈ గేటు సీతానగరంకు పిలవబడే చీరాల నగరం, పాత చీరాల, కొత్తపాలెం గ్రామాలను కలుపుతుంది. అయితే దీనికి ప్రత్యామ్నాయంగా ప్రజలు పాతచీరాల, దేశాయిపేట గేట్లను ఉపయోగించుకోవాల్సిందిగా తెలిపారు.