అన్నమయ్య: రామాపురం మండలం కల్పనాయుని చెరువు గ్రామం మూలపల్లెలో నిర్వహించిన శ్రీ హనుమత్సమేత సీతారామలక్ష్మణ గణపతి విగ్రహ కలశ ప్రతిష్టా మహోత్సవంలో వైసీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శ్రీకాంత్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాయచోటి నియోజకవర్గాన్ని ఆధ్యాత్మిక కేంద్రంగా అభివృద్ధి చేసే లక్ష్యం నెరవేరుతుండటం ఆనందంగా ఉందన్నారు.