ATP: డిగ్రీ, ఇంజనీరింగ్, పీజీ విద్యార్థుల సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ అనంతపురం నగరంలోని అంబేద్కర్ సర్కిల్లో ఏఐఎస్ఎఫ్ విద్యార్థి సంఘం నాయకుల ఆధ్వర్యంలో బుధవారం మోకాళ్లపై నిల్చుని నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా ఏఐఎస్ఎఫ్ జిల్లా అధ్యక్షులు హనుమంతరాయుడు మాట్లాడుతూ యువ గళం పాదయాత్రలో నారా లోకేష్ ఇచ్చిన జీవో నెంబర్ 77 రద్దు చేయాలన్నారు.