NDL: జిల్లాలోని ప్రముఖ శైవ క్షేత్రమైన శ్రీశైల క్షేత్రంలో నేటి సాయంత్రం స్వామి అమ్మవారికి పల్లకి ఉత్సవాన్ని సాంప్రదాయపద్ధతిగా నిర్వహిస్తారు. సర్కారీ సేవ కింద దేవస్థానం ప్రతిరోజు వివిధ ప్రత్యేక పూజ కార్యక్రమాలను చేపడుతోంది. అలాగే ధర్మపథంలో భాగంగా.. ఆలయ దక్షిణ మాడవీధుల్లోని నిత్య కళారాధన వేదిక వద్ద వివిధ సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహిస్తారు.