W.G: రైతులు సామూహికంగా ఎలుకల నిర్మూలన కార్యక్రమం చేపడితే వరి చేలలో ఎలుకలు పూర్తిగా నివారించుకోవచ్చని మొగల్తూరు మండల వ్యవసాయ శాఖ అధికారి షేక్ అబ్దుల్ రహీం అన్నారు. గురువారం ఆయన మొగల్తూరు గ్రామంలో సామూహిక ఎలుకల నిర్మూలన కార్యక్రమాన్ని రైతులు సమక్షంలో ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో వరి రైతులు పాల్గొన్నారు. అనంతరం వరి పంట సస్యరక్షణపై అవగాహన కల్పించారు.