ELR: జంగారెడ్డిగూడెం స్థానిక పంగిడిగూడెం రోడ్డులో ఉన్న విద్యుత్ కార్యాలయం ఎదుట బుధవారం సీపీఎం ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యుత్ బిల్లులను దహనం చేశారు. మండల కార్యదర్శి జీవరత్న మాట్లాడుతూ.. ట్రూ అప్ చార్జీల పేరుతో విధించిన చార్జీలను వెంటనే తగ్గించాలని డిమాండ్ చేశారు. స్మార్ట్ మీటర్ల బిగింపు ప్రక్రియ నిలుపుదల చేయాలన్నారు.