CTR: కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రాష్ట్ర ప్రజలకు సంక్షేమ పథకాలతోపాటు అభివృద్ధి పనులు జోరుగా జరుగుతున్నాయని నగరి ఎమ్మెల్యే గాలి భానుప్రకాశ్ అన్నారు. చిత్తూరులోని టీడీపీ జిల్లా కార్యాలయంలో జరిగిన సమన్వయ కమిటీ సమావేశంలో ఎమ్మెల్యే పాల్గొన్నారు. ఆయన మాట్లాడుతూ.. వైసీపీ పాలనలో ఎలాంటి అభివృద్ధి జరగలేదని విమర్శించారు. అర్హులందరికీ పథకాలు అందించడానికి తాము కృషి చేస్తామన్నారు.