ప్రకాశం: చదువుతో పాటు విద్యార్థులు క్రీడల్లో రాణించాలని మార్కాపురం టౌన్, రూరల్ ఎస్సైలు సైదా బాబు, డాక్టర్ రాజమోహన్ రావు అన్నారు. ఆదివారం మార్కాపురంలోని ఓ పాఠశాలలోని బాస్కెట్బాల్, టెన్నిస్ కోట్లను వాళ్ళు ప్రారంభించారు. విద్యార్థులు క్రీడల వల్ల మానసిక ఉల్లాసంతో పాటు శారీరక దృఢత్వం పెంపొందుతుందని, వారిని తల్లిదండ్రులు ప్రోత్సహించాలన్నారు.