W.G: కాళ్లకూరు శ్రీవేంకటేశ్వరస్వామి దేవాలయం మాడవీధుల విస్తరణ కోసం భక్తులు ఉదారంగా స్పందించారు. కలవపూడికి చెందిన పెన్మెత్స దుర్గాప్రసాదరాజు- శ్రీదేవి, వేగేశ్ హేమంత్ సూర్యనారాయణరాజు -జ్యోతిర్మయి, దాట్ల కృష్ణరోహిత్ -చామంతికిరణ్మయి దంపతులు రూ. 2,11,116 విరాళాన్ని అందజేశారు. ఈ మొత్తాన్ని దేవస్థానం ఛైర్మన్ అడ్డాల శివరామరాజు, ఈవో మోకా అరుణ్ కుమార్ స్వీకరించారు.