VZM: పవిత్ర పుణ్యక్షేత్రం రామతీర్థం బోడికొండ చుట్టూ బీటీ రహదారి నిర్మాణం శరవేగంగా సాగుతుంది. ఎమ్మెల్యే లోకం నాగ మాధవి చొరవతో ఈ రహదారి నిర్మాణానికి రూ.2 కోట్లు నిధులు మంజూరయ్యాయి. జనసేన మండల నాయకులు కరిమజ్జి గోవిందరావు పర్యవేక్షణలో రహదారి పనులు వేగవంతమవుతున్నాయి. ఈ రహదారి వైకుంఠ ఏకాదశికి పూర్తి చేయడానికి లక్ష్యంగా పెట్టుకుని పనులు సాగిస్తున్నారు.