ప్రకాశం: రోడ్డు ప్రమాదాల నివారణకు ప్రతి ఒక్కరూ భద్రతా నిబంధనలను పాటించాలని జిల్లా కలెక్టర్ అన్సారియా చెప్పారు. ఒంగోలులోని రవాణా శాఖ జిల్లా కార్యాలయంలో జరిగిన జాతీయ రహదారి భద్రత మాసోత్సవాల ముగింపు సభలో శనివారం కలెక్టర్ మాట్లాడుతూ.. వాహనాల చోదనలో ఎక్కువమంది నిర్లక్ష్యం కారణంగా రోడ్డు ప్రమాదాల బారిన పడుతున్నారని చెప్పారు.