GNTR: విజయదశమి సందర్భంగా జిల్లా రేంజ్ ఐజీ కార్యాలయంలో దుర్గా మాతకు విశేష పూజలు నిర్వహించారు. నగర రేంజ్ ఐజీ సర్వ శ్రేష్ఠ త్రిపాఠీ స్వయంగా పూజలు చేశార. రేంజ్లోని జిల్లాలో ప్రజలు సుఖసంతోషాలతో ఉండాలని, పోలీస్ సిబ్బంది ధైర్యంగా విధులు నిర్వహించాలని దుర్గా మాతను ప్రార్థించారు. వాహనాలకు ప్రత్యేక పూజలు చేసి, రాకపోకలు సురక్షితంగా సాగాలని ఆయన ఆకాంక్షించారు.