సత్యసాయి: మిర్చి రైతుల సమస్యలపై దమ్ముంటే వైసీపీ అధినేత జగన్ అసెంబ్లీకి వచ్చి చర్చించాలని బీసీ సంక్షేమ శాఖ మంత్రి సవిత సవాల్ విసిరారు. గురువారం టీడీపీ కేంద్ర కార్యాలయంలో విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడుతూ.. టీడీపీ హయాంలోనే మిర్చి రైతులకు మేలు జరిగిందన్నారు. ఈ అంశంపై అసెంబ్లీలో చర్చించేందుకు జగన్ హాజరుకావాలని డిమాండ్ చేశారు.