కృష్ణా: పెడన మండలానికి 215 టన్నుల యూరియా స్టాక్ చేరుకుందని మండల వ్యవసాయ అధికారిణి జెన్నీ శనివారం తెలిపారు. కమలాపురం, కవిపురం, చేవెండ్ర, పెడన, కొంకేపూడి, నందమూరు, పెనుమల్లి, మచెర్ల, నందిగామ, దావోజిపాలెం గ్రామాల్లో రైతులు యూరియాను పొందవచ్చని ఆమె సూచించారు. మిగిలిన గ్రామాలకు ఆదివారం స్టాక్ అందుబాటులోకి వస్తుందని, రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు.