KKD: కూటమి ప్రభుత్వం కేవలం ప్రచారానికే పరిమితమైందని, ప్రజలకు చేసింది శూన్యమని వైసీపీ కాకినాడ రూరల్ ఇంఛార్జ్ కురసాల కన్నబాబు విమర్శించారు. శుక్రవారం తన నివాసంలో మీడియాతో మాట్లాడారు. లక్షల ఉద్యోగాలతో జాబ్ క్యాలెండర్ ఇస్తామన్న హామీ ఏమైందని నిలదీశారు. యువగళం అంటూ హడావిడి చేసిన లోకేశ్ ఇప్పుడు ఎక్కడ ఉన్నారని ప్రశ్నించారు.