AKP: నర్సీపట్నం మున్సిపాలిటీ పరిధిలోని 16వ వార్డు శారదానగర్లో ఆదివారం మున్సిపల్ సిబ్బంది కాలువల పూడికతీత పనులను ముమ్మరంగా చేపట్టారు. మున్సిపల్ శానిటరీ అధికారుల పర్యవేక్షణలో ఈ పూడిక తీత పనులు జరిగాయి. జేసీబీ సాయంతో డ్రైనేజీలో పూడికను, చెత్తను తొలగించడం జరిగింది. ఈ కార్యక్రమంలో మున్సిపల్, పారిశుద్ధ్య సిబ్బంది పాల్గొన్నారు.