ELR: జీలుగుమిల్లి మండలం బర్రింకలపాడులోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో మంగళవారం ఎమ్మెల్యే చిర్రి బాలరాజును కాటికాపర్ల సంఘం వారు కలిశారు. స్మశాన కార్మికుల్ని నాలుగో తరగతి ఉద్యోగులకు గుర్తించి ప్రమాద బీమా కల్పించాలని కోరారు. స్మశాన కార్మికులకు పెన్షన్ సౌకర్యం కల్పించాలనీ జిల్లా గౌరవ అధ్యక్షులు ఫ్రాన్సిస్ కోరారు. అలాగే పలు సమస్యలపై వినతిపత్రం ఇచ్చారు