CTR: కుప్పం నియోజకవర్గంలో 7 పరిశ్రమల ఏర్పాటుకు సంబంధించి ఈ నెల 28న సీఎం చంద్రబాబు వర్చువల్ విధానంలో శంకుస్థాపన చేయనున్నారు. కుప్పం ప్రాంత పారిశ్రామిక వికాసం దిశగా ప్రగతి పథంలో ముందడుగులో భాగంగా రూ.2,203 కోట్ల పెట్టుబడితో దాదాపు 22 వేల మందికి ప్రత్యక్ష, పరోక్ష ఉపాధి అవకాశాలు రానున్నాయి.