PPM: పార్వతీపురం, జగన్నాథపురానికి చెందిన టీడీపీ నాయకులు, వర్తక కళాసీ సంఘం నాయకులు గేదెల సర్వేశ్వరరావు ఇటీవల ప్రమాదంలో గాయపడి కాలుకు గాయమైంది. ఆయన బైపాస్ రోడ్డులో గల హాస్పిటల్లో చికిత్స పొందుతున్న విషయాన్ని తెలుసుకున్న ఎమ్మెల్యే విజయ్ చంద్ర శనివారం ఆస్పత్రికి వెళ్లి పరామర్శించారు. వారి ఆరోగ్య పరిస్థితిని వైద్యులను అడిగి తెలుసుకున్నారు.