PLD: గురజాల మండలం పులిపాడు గ్రామ సమీపంలో సోమవారం ఉదయం నీటి గుంతలో పడి స్కూల్ బస్సు డ్రైవర్, విద్యార్థి మృతి చెందారు. ఈ క్రమంలో గురజాల ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావు గురజాల ప్రభుత్వ ఆసుపత్రిలో డ్రైవర్, విద్యార్థి మృతదేహాలను సందర్శించి వారి కుటుంబ సభ్యులను పరామర్శించారు. అనంతరం ఎమ్మెల్యే ఈ ప్రమాదం ఎలా జరిగిందో అడిగి తెలుసుకుని దైర్యం చెప్పారు.