ATP: రాయదుర్గం నియోజకవర్గంలోని మార్కెట్ యార్డుల అభివృద్ధికి రూ. 6.50 కోట్లు మంజూరు చేసేందుకు మార్కెటింగ్ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు సానుకూలంగా స్పందించారు. ప్రభుత్వ విప్ కాలవ శ్రీనివాసులు అమరావతిలో మంత్రిని కలిసి నిధులపై విన్నవించారు. స్పందించిన మంత్రి వెంటనే నిధులు మంజూరు చేస్తామని హామీ ఇచ్చారు.