కోనసీమ: రైతుల సంక్షేమానికి కూటమి ప్రభుత్వం పెద్దపీట వేస్తుందని కార్మిక శాఖ మంత్రి సుభాష్ పేర్కొన్నారు. మంగళవారం సాయంత్రం అయన మాట్లాడుతూ.. అన్నదాతను ఆదుకునేందుకు అనుగుణంగా వ్యవసాయ రంగానికి బడ్జెట్లో రూ.43 వేల 42 కోట్లు కేటాయించిన ఘనత కూటమి ప్రభుత్వానికి దక్కుతుందన్నారు. రామచంద్రపురం నీటి సంఘాల ఎన్నికల్లో ఉమ్మడి కూటమి రైతులు ఏకగ్రీవం కావడం హర్షణీయమన్నారు.