తిరుపతిలో గ్యాస్ సంక్షోభానికి వ్యతిరేకంగా కాంగ్రెస్ పార్టీ శ్రేణులు నిరసనకు దిగాయి. కేంద్ర మాజీ మంత్రి చింతా మోహన్ ఆధ్వర్యంలో గ్యాస్ సిలిండర్లను నెత్తిన పెట్టుకుని వినూత్నంగా నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గ్యాస్ సంక్షోభాన్ని నివారించడంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పూర్తిగా విఫలమయ్యాయని ధ్వజమెత్తారు.