PPM: గుమ్మలక్ష్మీపురం ఏకలవ్య రెసిడెన్షియల్ పాఠశాలలో మిగులు సీట్లకు దరఖాస్తుల ఆహ్వానిస్తున్నట్లు ప్రిన్సిపల్ శ్రీవీర్ సింగ్ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. 2026-27 విద్యా సంవత్సరానికి గాను 7వ తరగతికి ఒక సీటు (బాలిక), 8, 9వ తరగతులకు ఒక్కో సీటు (బాలురు) ఎస్టీ విద్యార్థుల నుంచి కోరుతున్నామన్నారు. దరఖాస్తులను ఆఫ్లైన్లో ఈనెల 5 నుంచి 10వ తేదీ వరకు స్వీకరిస్తున్నామన్నారు.