ELR: తెలుగువారి ఆత్మగౌరవ ప్రతీక టీడీపీ అని తెలుగు యువత రాష్ట్ర కార్యదర్శి తోట లక్ష్మీనారాయణ అన్నారు. ఆదివారం టీ.నర్సాపురం మండలం తిరుమలదేవిపేట పంచాయతీ పరిధిలో జరిగిన టీడీపీ 44వ ఆవిర్భావ దినోత్సవ వేడుకల్లో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా జండా ఎగరవేసి కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు. సామాన్య ప్రజల అభివృద్ధి కోసం టీడీపీ కృషి చేసిందన్నారు.