నేడు తిరుపతి జిల్లా (Tirupathi District)లో సీఎం జగన్ (Cm Jagan) పర్యటిస్తున్నారు. పర్యటనలో భాగంగా ఏపీ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్మించిన శ్రీనివాస సేతు ఫ్లైఓవర్ (Srinivasa Setu FlyOver)ను సీఎం జగన్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తిరుపతికి మణిహారంగా శ్రీనివాస సేతు ఫ్లైఓవర్ నిలుస్తుందన్నారు.
ఈ శ్రీనివాససేతు ఫ్లైఓవర్ ప్రాజెక్టును తిరుపతి స్మార్ట్ సిటీ కార్పొరేషన్, టీటీడీ (TTD) సంయుక్తంగా చేపట్టిందన్నారు. శ్రీనివాస సేతు తిరుపతి ప్రజలకు అందుబాటులోకి రావడంతో ట్రాఫిక్ సమస్యలు తగ్గుతాయన్నారు. ఈ శ్రీనివాస్ సేతు ఫ్లైఓవర్ నిర్మాణ వ్యయం రూ.684 కోట్లు కాగా దీని పొడవు సుమారు 7.34 కిలోమీటర్లుగా ఉందని ఈ సందర్భంగా జగన్ వెల్లడించారు.
2019 మార్చిలో శ్రీనివాస సేతు ఫ్లై ఓవర్ (Srinivasa Setu FlyOver) నిర్మాణానికి శంకుస్థాపన చేశామని, ఆ ఫ్లైఓవర్ నిర్మాణంలో టీటీడీ రూ.458 కోట్లు ఖర్చు చేసిందని సీఎం జగన్ తెలిపారు. తిరుపతి నగరాన్ని మరింత అభివృద్ధి చేసేందుకు చర్యలు చేపడుతున్నట్లు వెల్లడించారు. ఈ సందర్భంగా సీఎం జగన్ తిరుపతి ఎస్వీ ఆర్ట్స్ కాలేజీ భవనాలను కూడా ప్రారంభించారు. కాగా తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాలు (Srivari Bramhotsavalu) నేటి నుంచి ప్రారంభమైన సందర్భంగా సీఎం జగన్ స్వామివారికి పట్టువస్త్రాలను సమర్పించనున్నారు.
మురికి కూపంగా ఉన్న మూసీ నదిని శుద్దీకరించి దానిపై 14 బ్రిడ్జీలను ఏర్పాటు చేయనున్నట్లు మంత్రి కేటీఆర్ తెలిపారు. మూసీ నది సుందరీకరణకు రూ.545 కోట్లతో పనులు చేపడుతున్నట్లు వెల్లడించారు.