CTR: వాట్సాప్ గ్రూపుల్లో పరస్పర అసభ్య పదజాలం ఉపయోగించి పోస్టులు చేయడంతో 2 వర్గాల మధ్య ఉద్రిక్తత నెలకొంది. ఈ ఘటన SRపురం మండలం పోధలపల్లి హరిజనవాడలో జరిగింది. ఆనందరావు ఇంటిపై ఏకాంబరం, భరత్, లోకేశ్, రాజేశ్, చరణ్ మారణాయుధాలతో దాడి చేసినట్లు సమాచారం. ఈ ఘర్షనలో ఆనందరావు, భారతి, జానీ,మార్కొండయ్యలకు తీవ్ర గాయాలయ్యాయి. SI సుమన్ నిందితులను అరెస్టు చేశారు.