NLR: దగదర్తి మండలంలో ఓ నాయకుడు అక్రమాలను ప్రజలకు తెలియపరిచే విధంగా ఓ దినపత్రికలో వార్త రాసినా విలేకరిని చంపేస్తామంటూ బెదిరింపులు పాల్పడిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఈ క్రమంలో ఆ విలేఖరి దగదర్తి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. బెదిరింపులకు పాల్పడిన వారిపై చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. ప్రజల కోసం పనిచేసే విలేకరులు.. ఎవరినైన ప్రశ్నించే హక్కు ఉంటుందని వివరించారు.