TG: మహబూబ్నగర్లో ఓ టీచర్కు వైన్స్ షాపు రావడంతో.. విద్యాశాఖ అధికారి ఆమెను సస్పెండ్ చేశారు. రాంనగర్ ZPHSలో పీఈటీగా పనిచేస్తున్న పుష్ప పేరుతో తన భర్త మద్యం టెండర్ వేశాడు. వారికి లక్కీ డ్రాలో మద్యం షాప్ రావడంతో.. ఇందుకు సంబంధించి పుష్ప సంతకాలు చేసి.. ప్రక్రియ పూర్తి చేసింది. అయితే దీనిపై కొంతమంది విద్యాశాఖ అధికారులకు ఫిర్యాదు చేయడంతో.. ఆమె ఉద్యోగం పోయింది.