NLR: మనుబోలు మండలంలో ఆదివారం ఉదయం ప్రమాదం జరిగింది. గూడూరకు చెందిన వెంకటేశ్వర్లు తన భార్యతో కలిసి బైక్పై నెల్లూరుకు వెళ్తుండగా హైవేపై కొండూరు సత్రం పవర్ గ్రిడ్ ఎదురుగా బైకును వెనక నుంచి వేగంగా లారీ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో భార్యాభర్తలకు తీవ్ర గాయాలయ్యాయి. స్థానికులు గమనించి ఇద్దరినీ ఆసుపత్రికి తరలించారు.