KRNL: తుగ్గలి మండలంలోని ఎద్దులదొడ్డి గ్రామంలో పొలం రస్తా వివాదం ఆదివారం నాడు దాడికి దారితీసింది. ఈ ఘటనలో రంగప్పనాయుడు అనే వ్యక్తిపై కొడవళ్లతో దాడి జరగడంతో ఆయన తీవ్రంగా గాయపడ్డారు. బాధితుడి ఫిర్యాదు మేరకు, అదే గ్రామానికి చెందిన రాజశేఖర్, రవితేజతో పాటు మరో ఐదుగురిపై తుగ్గలి ఎస్సై నరేష్ కేసు నమోదు చేశారు.