NDL: దసరా నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా మహానందిలో ఇవాళ శతచండీ యాగం రుద్రహోమం చండీ హోమం వైభవంగా నిర్వహిస్తున్నారు. ఆలయ వేద పండితులు రవిశంకర్ అవధాని ఆధ్వర్యంలో పండితులు రుత్వకులు స్థానిక శతచండి యాగశాలలో ఉభయ దాతల ద్వారా పూజలు చేపడుతున్నారు. నవరాత్రి ఉత్సవాలు కావడంతో మహానంది ఆలయానికి వచ్చిన భక్తులు శ్రీ కామేశ్వరి దేవి శ్రీమహానందీశ్వర స్వామి వాళ్ళను దర్శించుకున్నారు.